LOADING...
Amaravati: అమరావతికి చట్టబద్ధ హోదా.. సభలో కీలక నిర్ణయం
అమరావతికి చట్టబద్ధ హోదా.. సభలో కీలక నిర్ణయం

Amaravati: అమరావతికి చట్టబద్ధ హోదా.. సభలో కీలక నిర్ణయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 28, 2026
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజధాని అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ శనివారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. సభ ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కీలక తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. తీర్మానం ఆమోదం పొందిన అనంతరం దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లు సమాచారం. సభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. రాష్ట్రానికి శాశ్వత రాజధాని నిర్మాణం అత్యవసరమని, ఈ దిశగా సీఎం చంద్రబాబు సంకల్పంతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కీలక నిర్ణయాలు మారకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.

వివరాలు

29వేల మంది రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు

ఇక మంత్రి పి. నారాయణ మాట్లాడుతూ గతంలో రాజకీయ లాభాల కోసం రాష్ట్ర విభజన జరిగిందని విమర్శించారు. విభజన తర్వాత రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని అన్నారు. 2015 జనవరి 1న ల్యాండ్ పూలింగ్‌కు నోటిఫికేషన్ ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఫిబ్రవరి నాటికి సుమారు 34,400 ఎకరాల భూమిని 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని వివరించారు. వైసీపీ నాయకులు ఎన్ని విమర్శలు, దుష్ప్రచారాలు చేసినా రైతులు ఎక్కడా వెనుకడుగు వేయలేదని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

Advertisement