Page Loader
Vijayasai Reddy: వైసీపీ హాయంలో మద్యం కుంభకోణం.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు 
వైసీపీ హాయంలో మద్యం కుంభకోణం.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు

Vijayasai Reddy: వైసీపీ హాయంలో మద్యం కుంభకోణం.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 15, 2025
03:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్‌ (స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం) నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ (YSRCP) హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఆయనకు నోటీసులు అందినట్లు అధికారికంగా సమచారం అందింది. ఈ నెల 18న విజయవాడలోని సిట్‌ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆయనకు సూచించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ విచారణకు సంబంధించి సిట్‌ అధికారులు విజయసాయిరెడ్డిని ఈ నెల 18న తాము చేపట్టే దర్యాప్తులో భాగంగా విచారించేందుకు ఆహ్వానించారు.