LOADING...
CM Vijay: 14.43 లక్షల మంది రైతులకు రుణమాఫీ.. సీఎం విజయ్‌ సంచలన నిర్ణయం
14.43 లక్షల మంది రైతులకు రుణమాఫీ.. సీఎం విజయ్‌ సంచలన నిర్ణయం

CM Vijay: 14.43 లక్షల మంది రైతులకు రుణమాఫీ.. సీఎం విజయ్‌ సంచలన నిర్ణయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2026
02:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ రైతులకు శుభవార్త ప్రకటించారు. సహకార బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందిన రైతులకు విస్తృత స్థాయిలో రుణమాఫీ కల్పిస్తున్నట్లు మంగళవారం వెల్లడించారు. తాజా నిర్ణయం ప్రకారం రూ.75,000 వరకు పంట రుణాలు తీసుకున్న సన్న, చిన్న, పెద్ద రైతులందరికీ పూర్తి రుణమాఫీ అమలు చేయనున్నారు. అలాగే రూ.75,000 కంటే ఎక్కువ రుణభారం ఉన్న రైతులకు ఒక్కొక్కరికి రూ.35,000 చొప్పున మాఫీ అందించనున్నట్లు తెలిపారు. గత నెలలో ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకంలో సన్నకారు రైతులకు రూ.50,000 వరకు రుణమాఫీ, చిన్న రైతులకు రూ.50,000 వరకు ఉన్న రుణాలపై 50 శాతం మాఫీ, అలాగే రూ.లక్ష వరకు పంట రుణాలు ఉన్న పెద్ద రైతులకు రూ.5,000 వరకు మాఫీ ప్రకటించింది

వివరాలు

బ్యాంకులకు 60 రోజుల్లో చెల్లిస్తాం

అయితే ఆ పథకం రైతుల ఆశలను నెరవేర్చలేదని భావించిన రైతులు పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం సచివాలయంలో సీఎం విజయ్‌ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో రుణమాఫీ విధానాన్ని పునఃపరిశీలించి కీలక మార్పులు చేశారు. కొత్త మార్గదర్శకాలతో అమలు కానున్న రుణమాఫీ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14.43 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ఖజానాపై అదనంగా రూ.5,932 కోట్ల భారం పడనుంది. అలాగే ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా రుణమాఫీ కింద సహకార బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాన్ని 45 నుంచి 60 రోజుల్లోగా ప్రభుత్వం విడుదల చేస్తుందని వెల్లడించింది.

Advertisement