Election Commissioners Bill: లోక్సభలో ఆమోదం పొందిన ఎలక్షన్ కమీషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లు
అత్యంత వివాదాస్పదమైన చీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం,సేవా నిబంధనలు,పదవీకాలం) బిల్లు, 2023కి గురువారం లోక్సభలో ఆమోదించింది. ఈ నెల ప్రారంభంలో, ప్రతిపక్షాలు వాకౌట్ చేసినప్పటికీ, రాజ్యసభ ఆమోదించింది. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)లోని ముగ్గురు సభ్యుల నియామకానికి సంబంధించిన విధివిధానాలను ఏర్పాటు చేయడం ఈ బిల్లు లక్ష్యం. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తి (CJI)తో కూడిన ప్యానెల్ ఎన్నికల కమిషన్ను ఎన్నుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలను విభేదిస్తూ కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చింది.
CEC, ECలను రక్షించే నిబంధనలలో చాలా ముఖ్యమైన సవరణ
ఎన్నికల కమిషనర్ల స్వతంత్ర ప్రతిపత్తిని నిర్ధారించేందుకు సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. అయితే ఈ రోజు కేంద్రం తీసుకువచ్చిన ఈ బిల్లు, సుప్రీంకోర్టును ఎంపిక ప్రక్రియ నుండి దూరంగా ఉంచనుంది. CEC, EC లు వారి పదవీ కాలంలో తీసుకున్న చర్యలకు సంబంధించిన చట్టపరమైన చర్యల నుండి రక్షించే నిబంధనలలో చాలా ముఖ్యమైన సవరణను చేశారు. కొత్త బిల్లు ప్రకారం, న్యాయస్థానాలు ప్రస్తుత లేదా మాజీ-CEC లేదా ECకి వ్యతిరేకంగా సివిల్ లేదా క్రిమినల్ ప్రొసీడింగ్లను నిర్వహించడం లేదా అధికారిక విధి లేదా విధులను నిర్వర్తించడంలో వారు తీసుకున్న చర్యలలో కలుగజేసుకునే అధికారాలు న్యాయస్థానాలకు లేకుండా నిషేధించబడ్డాయి.