NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో అభినవ దుశ్శాసన పర్వం
    తదుపరి వార్తా కథనం
    Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో అభినవ దుశ్శాసన పర్వం
    Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో అభినవ దుశ్శాసన పర్వం

    Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో అభినవ దుశ్శాసన పర్వం

    వ్రాసిన వారు Stalin
    May 26, 2024
    10:42 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లో గిరిజన బాలికలపై అత్యాచారం జరిగిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

    నిందితులు మొదట మొబైల్‌ యాప్‌ల ద్వారా బాలికలను ట్రాప్‌ చేసి, ఆ తర్వాత వారిని నిర్మానుష్య ప్రాంతాలకు పిలిచి అత్యాచారానికి పాల్పడ్డారు.

    ఇప్పటి వరకు ఏడుగురు బాలికలపై అత్యాచార ఘటనలు జరిగాయి. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

    బాలికలను ట్రాప్ చేసేందుకు నిందితులు వాయిస్ ఛేంజర్ కాలింగ్ యాప్‌ను ఉపయోగించారు.

    నిందితులు ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా విద్యార్థినులతో మహిళా వాయిస్‌తో మాట్లాడి స్కాలర్‌షిప్ ఇప్పిస్తానని మాయమాటలతో ఆకర్షిస్తుండేవారు.

    నిందితులు చాలా తెలివిగా స్కూల్ టీచర్ రంజనా మేడమ్ పేరుతో మాట్లాడేవారు.

    Details 

    7గురు గిరిజన బాలికలపై అత్యాచారం

    దీని తర్వాత నిందితులు విద్యార్థినులను ఒక్కొక్కరుగా నిర్మానుష్య ప్రాంతాలకు పిలిపించి వారిపై అత్యాచారం చేసేవారు.

    ఆ తర్వాత విద్యార్థినుల మొబైల్‌ ఫోన్లను కూడా నిందితులు తమ వద్ద ఉంచుకున్నారు. నిందితులు ఇప్పటి వరకు ఏడుగురు గిరిజన బాలికలపై అత్యాచారం చేశారు.

    మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలోని మఝౌలీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఉదంతం ఇది.

    ఈ కేసులో షెడ్యూల్డ్ తెగ విద్యార్థినులు బలిపశువులయ్యారు. నలుగురు బాధిత విద్యార్థినుల ఫిర్యాదు మేరకు మఝౌలీ పోలీస్ స్టేషన్ పోలీసులు విచారణ చేయగా అసలు విషయం వెలుగు చూసింది.

    నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 16 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

    Details 

    నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు 

    ఈ విషయాన్ని రేవా జోన్ ఐజీ మహేంద్ర సింగ్ సికర్వార్ శనివారం వెల్లడించారు.నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు.

    ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్రిజేష్ ప్రజాపతితో పాటు అతని సహచరులు రాహుల్ ప్రజాపతి, సందీప్ ప్రజాపతి, లవకుష్ ప్రజాపతిలను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

    నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. నిందితులు గతంలో ప్రైవేట్ ఉద్యోగం చేసేవారని ఐజీ తెలిపారు.

    ఈ సమయంలో అతని చేయి కాలింది. ఇప్పటి వరకు కళ్యాణ్, జబల్‌పూర్, నాసిక్‌లలో పనిచేశాడు. చేతికి కాలిన గాయాల ఆధారంగా నిందితుడిని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్

    తాజా

    NASA Chief: నాసా చీఫ్‌ ఎంపికలో యూటర్న్‌.. ట్రంప్‌ ప్రకటన కలకలం నాసా
    Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్‌.. బీజేపీ సంచలన ఆరోపణలు జ్యోతి మల్హోత్రా
    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్
    Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!  రజనీకాంత్

    మధ్యప్రదేశ్

    Mamata Banerjee: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అందుకే ఓడిపోయింది: మమతా బెనర్జీ  మమతా బెనర్జీ
    Kamal Nath: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి కమల్‌నాథ్‌ రాజీనామా?  కాంగ్రెస్
    BJP: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో సీఎం రేసులో ఉన్న బీజేపీ నేతలు వీరే  బీజేపీ
    Poll ads: ఎన్నికల ప్రకటనల్లో బీఆర్ఎస్‍ను మించిపోయిన కాంగ్రెస్.. ఎన్ని రూ.కోట్లు అంటే? అసెంబ్లీ ఎన్నికలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025