Page Loader
Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో అభినవ దుశ్శాసన పర్వం
Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో అభినవ దుశ్శాసన పర్వం

Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో అభినవ దుశ్శాసన పర్వం

వ్రాసిన వారు Stalin
May 26, 2024
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్‌లో గిరిజన బాలికలపై అత్యాచారం జరిగిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిందితులు మొదట మొబైల్‌ యాప్‌ల ద్వారా బాలికలను ట్రాప్‌ చేసి, ఆ తర్వాత వారిని నిర్మానుష్య ప్రాంతాలకు పిలిచి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇప్పటి వరకు ఏడుగురు బాలికలపై అత్యాచార ఘటనలు జరిగాయి. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాలికలను ట్రాప్ చేసేందుకు నిందితులు వాయిస్ ఛేంజర్ కాలింగ్ యాప్‌ను ఉపయోగించారు. నిందితులు ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా విద్యార్థినులతో మహిళా వాయిస్‌తో మాట్లాడి స్కాలర్‌షిప్ ఇప్పిస్తానని మాయమాటలతో ఆకర్షిస్తుండేవారు. నిందితులు చాలా తెలివిగా స్కూల్ టీచర్ రంజనా మేడమ్ పేరుతో మాట్లాడేవారు.

Details 

7గురు గిరిజన బాలికలపై అత్యాచారం

దీని తర్వాత నిందితులు విద్యార్థినులను ఒక్కొక్కరుగా నిర్మానుష్య ప్రాంతాలకు పిలిపించి వారిపై అత్యాచారం చేసేవారు. ఆ తర్వాత విద్యార్థినుల మొబైల్‌ ఫోన్లను కూడా నిందితులు తమ వద్ద ఉంచుకున్నారు. నిందితులు ఇప్పటి వరకు ఏడుగురు గిరిజన బాలికలపై అత్యాచారం చేశారు. మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలోని మఝౌలీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఉదంతం ఇది. ఈ కేసులో షెడ్యూల్డ్ తెగ విద్యార్థినులు బలిపశువులయ్యారు. నలుగురు బాధిత విద్యార్థినుల ఫిర్యాదు మేరకు మఝౌలీ పోలీస్ స్టేషన్ పోలీసులు విచారణ చేయగా అసలు విషయం వెలుగు చూసింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 16 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Details 

నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు 

ఈ విషయాన్ని రేవా జోన్ ఐజీ మహేంద్ర సింగ్ సికర్వార్ శనివారం వెల్లడించారు.నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్రిజేష్ ప్రజాపతితో పాటు అతని సహచరులు రాహుల్ ప్రజాపతి, సందీప్ ప్రజాపతి, లవకుష్ ప్రజాపతిలను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. నిందితులు గతంలో ప్రైవేట్ ఉద్యోగం చేసేవారని ఐజీ తెలిపారు. ఈ సమయంలో అతని చేయి కాలింది. ఇప్పటి వరకు కళ్యాణ్, జబల్‌పూర్, నాసిక్‌లలో పనిచేశాడు. చేతికి కాలిన గాయాల ఆధారంగా నిందితుడిని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.