NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Srisailam Temple: వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఈవో శ్రీనివాసరావు కీలక ప్రకటన!
    తదుపరి వార్తా కథనం
    Srisailam Temple: వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఈవో శ్రీనివాసరావు కీలక ప్రకటన!
    వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఈవో శ్రీనివాసరావు కీలక ప్రకటన!

    Srisailam Temple: వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఈవో శ్రీనివాసరావు కీలక ప్రకటన!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 06, 2025
    12:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు నిర్వహించనున్నారు. 11 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

    ఈ మేరకు శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. భక్తులు సంతోషంగా దర్శనానుభూతి పొందేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

    క్యూలైన్లలో ఇబ్బందులు లేకుండా, స్పష్టమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. భక్తులు దర్శనానికి ఎలాంటి అసౌకర్యం ఎదుర్కొనకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు.

    పాదయాత్ర భక్తుల కోసం అటవీశాఖతో సమన్వయం చేసుకుంటూ రహదారులను గ్రావెల్‌తో సరిచేస్తామని చెప్పారు.

    అలాగే పాదయాత్ర దారుల్లో మంచినీటి ట్యాంకర్లు, చలువ పందిళ్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

    Details

    ట్యాంకర్ల ద్వారా మంచినీటీ సరఫరా

    అటవీ ప్రాంతంలోని నీరు తాగడానికి అనువుకాదనిపిస్తే ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేస్తామని పేర్కొన్నారు.

    భక్తులు వాడి పడేసిన చెప్పులు, బట్టలు వంటి వస్తువులు పర్యావరణానికి ఇబ్బంది కలిగించకుండా డంపింగ్ యార్డుకు తరలించనున్నట్టు ఈవో తెలిపారు.

    ఉత్సవాలకు సంబంధించి అన్ని శాఖలతో సమన్వయం చేసుకునేందుకు ఇప్పటివరకు 54 లేఖలు పంపించామని, ఈనెల 31లోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు.

    అలాగే ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.

    ఈ బ్రహ్మోత్సవాలపై త్వరలో జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని, ఈ సంవత్సరం గతంతో పోలిస్తే 15 శాతం ఎక్కువ ఏర్పాట్లు చేయనున్నామని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శ్రీశైలం
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్
    Nara Rohit: ఈ ఏడాది అక్టోబర్‌లోనే నా పెళ్లి: నారా రోహిత్ నారా రోహిత్
    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్
    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా

    శ్రీశైలం

    నల్లమలలో 75 పులులు; ఎన్ఎస్‌టీఆర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పడి 50ఏళ్లు నాగార్జునసాగర్
    శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం ఆంధ్రప్రదేశ్
    Srisailam Dam:ఎగువ నుంచి వరద.. నాగార్జునసాగర్‌ 22 గేట్ల ద్వారా నీటి విడుదల   భారతదేశం
    Andrapradesh: జలాశయాల్లో పూడిక పెరుగుతోంది.. కేంద్ర జలసంఘం నివేదక రాష్ట్రం

    ఆంధ్రప్రదేశ్

    DAJGUA: ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్‌ అభియాన్‌ కింద ఆంధ్రప్రదేశ్‌ నుంచి 878 గ్రామాలు ఎంపిక: దుర్గాదాస్‌ ఉయికే  భారతదేశం
    Andhra Pradesh: ఏపీలో ప్రతిష్టాత్మక 'ఇన్నొవేషన్‌ యూనివర్సిటీ'.. ఫిజిక్స్‌ వాలాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం భారతదేశం
    Heavy Rains: అల్పపీడన ప్రభావం.. ఏపీలో స్కూళ్లకు సెలవు ప్రకటించిన అధికారులు భారీ వర్షాలు
    Amaravati: అమరావతిలో ప్రపంచ స్థాయి ప్రాజెక్టు.. దేశంలోనే తొలి పైప్డ్ గ్యాస్ రాజధాని! అమరావతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025