
Mahabubnagar MLC Bypoll: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బై ఎలక్షన్ లో BRS గెలుపు
ఈ వార్తాకథనం ఏంటి
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్(BRS)ఘన విజయం సాధించింది. దీనితో ఆ పార్టీ భారీగా ఊపిరిపీల్చుకున్నట్లయింది.
ఈ ఎన్నికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఐనా సరే BRS అభ్యర్థి నవీన్కుమార్ రెడ్డి 108 ఓట్ల మెజార్టీతో విజదుందుభి మోగించి సంచలనం సృష్టించారు.
మంగళవారం వెలువడనున్న లోక్ సభ ఫలితాల్లో BRS కు ఆశించిన మేర ఫలితాలు రాకపోవచ్చని అంచనాగా వుంది. ఈ నేపధ్యంలో నవీన్కుమార్..కారు పార్టీకి జీవం పోశారనే చెప్పాలి.
కాగా మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలుపొందడం విశేషం. దీంతో సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
మళ్లీ తమ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు.
Details
పోటీకి దూరంగా బీజేపీ
ఉమ్మడి జిల్లా స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా ఉన్న కశిరెడ్డి నారాయణరెడ్డి గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మారారు.
ఆ తర్వాత కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో మార్చి 28న ఎన్నికలు నిర్వహించారు.
బీఆర్ఎస్ తరఫున నవీన్కుమార్ రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ నుంచి మన్నె జీవన్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్గౌడ్ బరిలో నిలిచారు.
ఈ పోటీకి బీజేపీ దూరంగా ఉన్నది. మొత్తం 1437 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్కు దూరంగా ఉన్నారు.