NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 603 రోజులు 5స్టార్ హోటల్‌లో బస; బిల్లుకట్టకుండానే పారిపోయిన ఘనుడు
    తదుపరి వార్తా కథనం
    603 రోజులు 5స్టార్ హోటల్‌లో బస; బిల్లుకట్టకుండానే పారిపోయిన ఘనుడు
    603 రోజులు 5స్టార్ హోటల్‌లో బస; బిల్లుకట్టకుండానే పారిపోయిన ఘనుడు

    603 రోజులు 5స్టార్ హోటల్‌లో బస; బిల్లుకట్టకుండానే పారిపోయిన ఘనుడు

    వ్రాసిన వారు Stalin
    Jun 21, 2023
    05:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ ఏరోసిటీలోని లగ్జరీ హోటల్ రోసేట్ హౌస్‌‌లో ఘరానా మోసం జరిగింది. ఈ 5స్టార్ హోటల్‌లో అంకుష్ దత్తా అనే వ్యక్తి ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు ఏకంగా 603రోజులు బస చేసి బిల్లు కట్టకుండా పారిపోయాడు.

    ఇది తెలిసిన హోటల్ యాజమాన్యం లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది.

    ఈ వ్యవహారంపై ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (ఐజీఐ) విమానాశ్రయం సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

    ఎలాంటి బిల్లులు చెల్లించకుండా అంకుష్ దత్తా తమ హోటల్‌లో 603రోజులు ఉన్నాడని, ఇందుకు సంబంధించి అతను తమకు రూ.58లక్షల బిల్లు చెల్లించాలని రోసేట్ హౌస్‌‌ హోటయ యాజమాన్యం ఫిర్యాదులో పేర్కొంది.

    దిల్లీ

    హోటల్ సిబ్బంది సహకారంతోనే అన్నిరోజుల బస

    అంకుశ్ దత్తా 2019 మే 30న హోటల్‌లో దిగాడు. అయితే రకరకాలు కారణాలు చెబుతూ తన బసను జనవరి 22, 2021 వరకు పొడిగించారు.

    హోటల్ పాలసీ ప్రకారం బిల్లు కట్టకుండా అతిథి తన బసను 72గంటలు పొడిగించుకుంటే సీఈఓ, ఫైనాన్స్ కంట్రోలర్‌కు సమాచారం అందించాలి.

    కానీ హోటల్ సిబ్బంది అలా చేయలేదు. ఈ క్రమంలో హోటల్ సిబ్బంది సహకారంతోనే దత్తా బిల్లు చెల్లించకుండా దాదాపు రెండేళ్లు ఉండగలిగాడని యాజమాన్యం అనుమానిస్తోంది.

    ముఖ్యంగా హోటల్ ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్‌మెంట్ హెడ్ ప్రేమ్ ప్రకాష్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

    ప్రేమ్ ప్రకాష్‌ హోటల్ నిబంధనలను విస్మరించి దత్తా స్టేను పొడిగించినట్లు ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.

    దిల్లీ

    నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: హోటల్ యాజమాన్యం

    అంకుశ్ దత్తా వేర్వేరు తేదీల్లో రూ.10 లక్షలు, రూ.7 లక్షలు, రూ.20 లక్షల విలువ చేసే మూడు చెక్కులను చెల్లించినట్లు హోటల్ యాజమాన్యం గమనించింది.

    అయితే అవి బౌన్స్ అయ్యాయి. ప్రకాష్ ఈ విషయాన్ని హోటల్ యాజమాన్యం దృష్టికి తీసుకురాలేదని యాజమాన్యం తన ఫిర్యాదులో పేర్కొంది. హోటల్ లావాదేవాలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌కు కూడా హ్యాక్ చేసి, అక్రమాలకు పాల్పడినట్లు యాజమాన్యం వెల్లడించింది.

    ఈ క్రమంలో క్రిమినల్ నేరాలు, మోసం, ఫోర్జరీ వంటి నేరాలకు పాల్పడినందున వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హోటల్ యాజమాన్యం డిమాండ్ చేసింది.

    ఐజీఐ పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ నేరాలు బయటపడ్డాయని తేలింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    విమానాశ్రయం
    తాజా వార్తలు

    తాజా

    World Environment Day 2025: నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ప్లాస్టిక్ కాలుష్యాన్ని జయిద్దాం అనే థీమ్‌తో వేడుకలు ముఖ్యమైన తేదీలు
    11 years of NDA: ఎన్డీయే ప్రభుత్వానికి నిన్నటితో 11 ఏళ్లు.. ఆసక్తికర పోస్ట్ చేసిన మోదీ  నరేంద్ర మోదీ
    Stampede in India: గత ఏడాది కాలంలో దేశంలో జరిగిన తొక్కిసలాట ఘటనలు ఇవే.. భారతదేశం
    Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన కర్ణాటక హైకోర్టు  బెంగళూరు

    దిల్లీ

    కొత్త పార్లమెంట్ వద్ద నిరసన తెలిపేందుకు ర్యాలీగా వెళ్లిన రెజ్లర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు  రెజ్లింగ్
    దిల్లీలో 16ఏళ్ల బాలిక దారుణ హత్య; 20సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు; వీడియో వైరల్  భారతదేశం
    కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా?  నరేంద్ర మోదీ
    16ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి యూపీలో అరెస్ట్  హత్య

    విమానాశ్రయం

    కోడి కత్తి కేసు: జగన్ రావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    1.5 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది అరెస్ట్ ఎయిర్ ఇండియా
    ఇండిగో విమానం పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్; ప్రయాణికుడు మృతి పాకిస్థాన్
    భారతదేశపు మొట్టమొదటి మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ బెంగళూరు

    తాజా వార్తలు

    'NMODI': కారు నంబర్ ప్లేట్‌పై మోదీ పేరు; అమెరికాలో ఓ భారతీయుడి వీరాభిమానం  నరేంద్ర మోదీ
    స్మార్ట్ టీవీల కోసం ట్విట్టర్ వీడియో యాప్‌ వస్తోంది: మస్క్ ట్వీట్ ట్విట్టర్
    యూఎన్ హెడ్ ఆఫీస్‌లో మోదీ ఆధ్వర్యంలో యోగా డే: 180 దేశాల ప్రతినిధులు హాజరు  యోగ
    రూ.88,032.5 కోట్ల విలువైన 500 నోట్ల మాయంపై ఆర్‌బీఐ కీలక ప్రకటన ఆర్ బి ఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025