తదుపరి వార్తా కథనం
Ghaziabad: భార్యను హత్య చేసి, మృతదేహాన్ని 4 రోజులు ఇంట్లో ఉంచి..
వ్రాసిన వారు
Stalin
Mar 03, 2024
05:17 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్ప్రదేశ్లోని ఘజియాబాద్లో దారుణం జరిగింది. 55 ఏళ్ల భరత్సింగ్ తన భార్యను చంపి, ఆపై మృతదేహాన్ని ఇంట్లో 4 రోజుల పాటు ఉంచాడు.
ఇంటి నుంచి దుర్వాసన రావడంతో భర్తే తన భార్యను హత్య చేసినట్లు ఇరుగుపొరుగు వారికి చెప్పడం గమనార్హం.
ఈ క్రమంలో చుట్టుపక్కల వాళ్లు పోలీసులు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని 51 ఏళ్ల సునీత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఘజియాబాద్లోని ఓ కాలనీలో భరత్సింగ్- సునీత దంపతులు కొంతకాలంగా నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు.
ఇద్దరి మధ్య గొడవ జరిగిన సందర్భంలో భార్యభర్తలను హత్య చేసినట్లు భరత్ సింగ్ ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఘజియాబాద్లో దారుణ హత్య
Ghaziabad: Man kills wife, locks himself up in house with body for 3 days
— The Times Of India (@timesofindia) March 3, 2024
Read: https://t.co/dJoYRk1QMA pic.twitter.com/2jyv5UzqkU