Page Loader
Bengaluru Murder: బెంగళూరు హోటల్‌లో ప్రియురాలిని కత్తితో పొడిచి.. ఒక రోజు ఆ రూమ్‌లోనే గ‌డిపాడు
బెంగళూరు హోటల్‌లో ప్రియురాలిని కత్తితో పొడిచి

Bengaluru Murder: బెంగళూరు హోటల్‌లో ప్రియురాలిని కత్తితో పొడిచి.. ఒక రోజు ఆ రూమ్‌లోనే గ‌డిపాడు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2024
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

అస్సాం రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల మాయా గగోయ్ బెంగళూరులోని సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో హత్యకు గురైంది. శనివారం ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఆ రూమ్‌లోకి వెళ్లింది. కానీ మూడు రోజులు తర్వాత ఆ రూమ్‌లో ఆమె మృతదేహం కనిపించింది. ఈ కేసులో ఆమె బాయ్‌ఫ్రెండ్ ఇప్పటికే హత్య కోసం ప్రణాళిక వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రధాన నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. పోలీసులు మాయా గగోయ్ కుళ్లిన మృతదేహాన్ని గుర్తించారు. ఆ రూమ్‌ను అర్వ్ హర్నీ అనే వ్యక్తి బుక్ చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిర్ధారించారు. నవంబర్ 23వ తేదీ సాయంత్రం 12:30 నిమిషాలకు అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించినట్లు ఫుటేజ్ చూపిస్తోంది.

వివరాలు 

 రూమ్‌లోని డాక్యుమెంట్ల ఆధారంగా హతురాలు మాయా గగోయ్ గా గుర్తింపు 

అనంతరం 26వ తేదీ మంగళవారం ఉదయం 8:30 నిమిషాల సమయంలో హర్నీ మాత్రమే రూమ్ నుంచి బయటపడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం, సోమవారం మాయాను హర్నీ కత్తితో పొడిచి హత్య చేసినట్లు తెలియజేశారు. ఈ హత్యం బెంగుళూరులోని ఇందిరానగర్ ప్రాంతంలోని అద్దె అపార్ట్‌మెంట్‌లో జరిగింది. హత్య చేసిన తర్వాత హర్నీ ఓ రోజు ఆమె శరీరంతో ఉండి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రూమ్‌లో పసుపు రంగు నైలాన్ రోప్, దుప్పట్లు, మెత్తలపై క్తం మ‌ర‌క‌లు ఉన్న‌ట్లు గుర్తించారు. పోలీసులు రూమ్‌లోని డాక్యుమెంట్ల ఆధారంగా మాయా గగోయ్ అనే పేరును కనుగొన్నారు.

వివరాలు 

ఆమె తలపై గాయాలు

ఆమె 19 ఏళ్ల వయసులో ఉన్నట్లు నిర్ధారించారు. ఆమె శరీరంపై అనేక గాయాలు ఉన్నట్లు, అందులో ఒకటి ఛాతిపై కత్తితో పొడిచిన గాయం కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె తలపై కూడా గాయాలు ఉన్నట్లు డీసీపీ దేవరాజ్ చెప్పారు. నిందితుడు కేరళకు చెందినవాడిగా భావిస్తున్నారు. అపార్ట్‌మెంట్ నుండి వెళ్లిన తర్వాత అతను తన మొబైల్ ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేశాడు. నవంబర్ 23 నుండి 26వ తేదీ మధ్య, అపార్ట్‌మెంట్‌లో ఎవరూ ప్రవేశించలేదని ఆధారాలు చెప్పుతున్నాయి.

వివరాలు 

హత్య కేసు నమోదు, నిందితుడి గాలింపు 

హత్యా సమయంలో,కత్తి తీసుకెళ్లిన హర్నీ రూమ్‌లోకి వెళ్లి,ఆర్డర్ చేసిన నైలాన్ రోప్‌తో మరిన్ని దారుణమైన చర్యలు చేపట్టినట్లు భావిస్తున్నారు. చెడు వాసన రావడంతో పోలీసులు అపార్ట్‌మెంట్‌కు వెళ్లి, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి విచారణ ప్రారంభించారు. మాయా గగోయ్ హెచ్‌ఎస్ఆర్ లేఅవుట్‌లో ఉన్న ప్రైవేట్ సంస్థలో కౌన్సిలర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు, ఆమె సోదరి ఫిర్యాదు చేసిన ఆధారంగా పోలీసులు హత్య కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.