LOADING...
Dr. Manthena Satyanarayana Raju: ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు 
ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

Dr. Manthena Satyanarayana Raju: ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 29, 2025
05:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణుడు డాక్టర్‌ మంతెన సత్యనారాయణ రాజును ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రకృతి వైద్యంపై ఆయన సలహాలు, సూచనలు అందించనున్నారు. ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం అధికారికంగా జారీ చేసింది. డాక్టర్‌ మంతెన సత్యనారాయణ రాజు గత అనేక దశాబ్దాలుగా ప్రకృతి వైద్య విధానాల ద్వారా ప్రజలకు విస్తృత సేవలు అందిస్తూ గుర్తింపు పొందారు. ఉండవల్లి కరకట్ట ప్రాంతంలో 'ప్రకృతి చికిత్సాలయం' పేరిట ఆసుపత్రిని స్థాపించి వైద్య సేవలు అందిస్తున్నారు. అలాగే విజయవాడ, నరసాపురం ప్రాంతాల్లో కూడా ఆయన నిర్వహణలో ఆరోగ్యాలయం కేంద్రాలు కొనసాగుతున్నాయి.

వివరాలు 

రెండేళ్ల కాలపరిమితి

ఈ సందర్భంగా మాస్‌ కమ్యూనికేషన్‌ రంగానికి చెందిన పోచంపల్లి శ్రీధర్‌రావును కూడా ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. డాక్టర్‌ మంతెన సత్యనారాయణ రాజు, పోచంపల్లి శ్రీధర్‌రావు ఇద్దరూ రెండేళ్ల కాలపరిమితి వరకు తమ తమ పదవుల్లో కొనసాగనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

Advertisement