NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Munir Ahmed: పాక్ మహిళతో పెళ్లి.. ఉద్యోగం పోయింది.. మోదీనే న్యాయం చేయాలి
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Munir Ahmed: పాక్ మహిళతో పెళ్లి.. ఉద్యోగం పోయింది.. మోదీనే న్యాయం చేయాలి
    పాక్ మహిళతో పెళ్లి.. ఉద్యోగం పోయింది.. మోదీనే న్యాయం చేయాలి

    Munir Ahmed: పాక్ మహిళతో పెళ్లి.. ఉద్యోగం పోయింది.. మోదీనే న్యాయం చేయాలి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 04, 2025
    04:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థానీ మహిళను పెళ్లాడిన విషయంలో సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మునీర్‌ అహ్మద్‌ ఉద్యోగం నుంచి తొలగించిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

    ఈ పరిణామం నేపథ్యంలో మునీర్‌ తాజాగా జాతీయ మీడియాతో స్పందించాడు.

    పాక్‌ మహిళను పెళ్లి చేసుకున్న విషయాన్ని అధికారులు తెలియజేయలేదనడం నిరాధారం అని, తాను అప్పుడే సమాచారాన్ని అందించినట్లు స్పష్టం చేశాడు.

    తన దగ్గర దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పాడు.

    '2024లో మెనల్‌ ఖాన్‌తో పెళ్లి జరిగింది. 2022 నుంచే ఆమెతో సంబంధం ఉందని అధికారులకు చెబుతూనే ఉన్నా. ఇప్పుడు నా తప్పేమిటి? అంటూ మునీర్‌ ప్రశ్నించాడు.

    Details

    మోదీ దృష్టికి తీసుకెళ్తా

    ఉద్యోగం నుంచి తొలగించారన్న వార్త విన్న వెంటనే షాక్‌కి లోనయ్యానని, తాను అన్యాయం జరిగిందని వాపోయాడు.

    తనపై తీసుకున్న చర్య న్యాయసమ్మతమయ్యేలా లేదని, ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు.

    పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ వివాహ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

    భారత ప్రభుత్వం ఇప్పటికే భారత్‌లో ఉన్న పాక్‌ జాతీయులు తమ స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేయగా, మునీర్‌ భార్య మెనల్‌ ఖాన్‌ వ్యవహారం అధికారుల దృష్టికి వచ్చింది.

    Details

    వీడియో కాల్ ద్వారా వివాహం

    ఆమెకు మంజూరైన వీసా గడువు ముగిసినా, ఆమె ఇప్పటికీ భారత్‌లోనే ఉన్నారని అధికారులు తెలిపారు.

    సీఆర్పీఎఫ్‌ 41వ బెటాలియన్‌కు చెందిన మునీర్‌ అహ్మద్‌ గతేడాది మేలో పాక్‌ మహిళ మెనల్‌ ఖాన్‌ను వీడియో కాల్‌ ద్వారా వివాహం చేసుకున్నాడు.

    ఆమె వీసాపై భారత్‌కు చేరుకున్న తర్వాత తన ఉనికిని గోప్యంగా ఉంచారని అధికారులు ఆరోపిస్తున్నారు.

    అయితే, ఈ ఆరోపణలను మునీర్‌ ఖండించాడు. "వాస్తవాలు ప్రభుత్వానికి తెలిసేలా ఎప్పుడో చెప్పాను. కావాలనే నన్ను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగం నుంచి తొలగించారని వ్యాఖ్యానించాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సీఆర్‌పీఎఫ్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    సీఆర్‌పీఎఫ్

    జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ  జీ20 సమావేశం
    Manipur-Terrorists Attack: మణిపూర్​ లో భద్రతా బలగాలపై దాడి..ఇద్దరు మృతి..మరో ఇద్దరికి గాయాలు ఉగ్రవాదులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025