NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Fish Prasadam: చేప ప్రసాదానికి భారీ ఏర్పాట్లు.. ప్రత్యేకంగా 140 స్పెషల్ బస్సులు ఏర్పాటు!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Fish Prasadam: చేప ప్రసాదానికి భారీ ఏర్పాట్లు.. ప్రత్యేకంగా 140 స్పెషల్ బస్సులు ఏర్పాటు!
    చేప ప్రసాదానికి భారీ ఏర్పాట్లు.. ప్రత్యేకంగా 140 స్పెషల్ బస్సులు ఏర్పాటు!

    Fish Prasadam: చేప ప్రసాదానికి భారీ ఏర్పాట్లు.. ప్రత్యేకంగా 140 స్పెషల్ బస్సులు ఏర్పాటు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 08, 2025
    11:10 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

    సెంట్రల్‌ జోన్‌ డీసీపీ వెల్లడించిన వివరాల ప్రకారం, షెడ్లు, ఫ్లడ్ లైట్లు, క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.

    ఆస్తమా తదితర శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు బత్తిన కుటుంబ సభ్యులు ఏటా ఉచితంగా ఈ ప్రసాదం అందిస్తున్న విషయం తెలిసిందే.

    ఈ ఏడాది కూడా జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది.

    చేప ప్రసాదం పొందడానికి అవసరమైన టోకెన్లను శనివారం (జూన్ 7) నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోనే పంపిణీ చేశారు.

    Details

    పలు రాష్ట్రాల నుంచి భారీగా తరలిస్తున్న ఆస్తమా బాధితులు

    అయితే టోకెన్ల పంపిణీ ఆలస్యంగా ప్రారంభం కావడంతో వేలాది మంది క్యూలైన్లలో నన్నాడుతూ అసహనం వ్యక్తం చేశారు.

    కేవలం రెండు కౌంటర్లతో పంపిణీ చేపట్టడంతో అక్కడికి చేరుకున్న జనం ఒక్కసారిగా ఎగబడటంతో అప్రమత్తమైన అధికారులు పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి చేశారు.

    చేప ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 10 గంటలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌ లు ప్రారంభించనున్నారు.

    ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి పలు రాష్ట్రాల నుండి ఆస్తమా బాధితులు భారీగా తరలివస్తున్నారు.

    ఇప్పటికే వేలాది మంది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కి చేరుకున్నారు.

    Details

    42 క్యూలైన్లు ఏర్పాట్లు

    ఈసారి చేప ప్రసాదం పంపిణీకి ఏకంగా 42 క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

    రవాణా సౌకర్యాలకూ ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం, ప్రత్యేకంగా ఆర్టీసీ 140 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. జూన్ 8న 60, జూన్ 9న 80 బస్సులు నడపనున్నారు.

    సాధారణ ఛార్జీలకే ఈ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ప్రయాణికుల సంఖ్య బట్టి అదనపు బస్సులు నడిపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

    ఈ ప్రసాదం ప్రధానంగా ఆస్తమా, అబ్బసం, దగ్గు, దమ్ము వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలున్న వారికి అందించబడుతుంది.

    సుమారు 170 సంవత్సరాల నుంచీ ఈ సంప్రదాయ కార్యక్రమం కొనసాగుతుండగా, రోగుల కోసం భోజనం, వసతి వంటి సౌకర్యాలు కూడా ప్రభుత్వం అందిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్

    తాజా

    Fish Prasadam: చేప ప్రసాదానికి భారీ ఏర్పాట్లు.. ప్రత్యేకంగా 140 స్పెషల్ బస్సులు ఏర్పాటు! హైదరాబాద్
    Gold Price Today: మహిళలకు శుభవార్త.. బంగారం ధరలు పతనం! బంగారం
    VIjay Bhanu: తెలుగు, తమిళ చిత్రాల్లో గుర్తింపు పొందిన నటి విజయభాను కన్నుమూత కోలీవుడ్
    kattalan: విలన్‌గా మళ్లీ సునీల్ ఎంట్రీ.. 'కట్టలన్' పోస్టర్‌తో స్టన్నింగ్ లుక్! టాలీవుడ్

    హైదరాబాద్

    Old City Metro : జోరుగా ఓల్డ్ సిటీలో మెట్రో పనులు.. సీఎం ఆదేశాలతో వేగవంతం మెట్రో రైలు
    Falaknuma: పాతబస్తీలో కలకలం.. నడిరోడ్డుపై రౌడీ‌షీటర్ దారుణ హత్య భారతదేశం
    Rains: హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం.. పలుచోట్ల ట్రాఫిక్ జామ్! భారతదేశం
    Outdated vehicles: కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చుకుని.. కొత్త వాహనాల కొనుగోలులో రాయితీ పొందండిలా.. ఆటోమొబైల్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025