Nagpur: నాగ్పుర్లో తెల్లవారుజామున భారీ పేలుడు.. 15 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగ్పూర్లో భారీ పేలుడు కలకలం రేపింది. నాగ్పుర్ జిల్లా కటోల్ ప్రాంతంలో ఉన్న SBL ఎనర్జీ లిమిటెడ్ పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమలో తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు. పలువురు తీవ్రంగా గాయపడగా, వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ఘటనాస్థలిలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు నిరంతరం చర్యలు కొనసాగిస్తున్నాయి.
Details
విధుల్లో 30మందికి పైగా ఉద్యోగులు
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు సూచించారు. ప్రమాదం జరిగిన ఈ పరిశ్రమలో డిటోనేటర్లు, కాస్ట్ బూస్టర్లు, భూకంప పేలుడు పదార్థాలు తయారు చేస్తారని స్థానికులు తెలిపారు. ఉదయం ఒక యూనిట్లో అకస్మాత్తుగా పేలుడు సంభవించిందని, ఆ సమయంలో 30 మందికి పైగా ఉద్యోగులు వివిధ యూనిట్లలో విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.