Loading...
Saharsa Passenger Train Fire: ప్యాసింజర్ రైలులో భారీ అగ్నిప్రమాదం.. క్షణాల్లో బూడిదైన బోగీ!
ప్యాసింజర్ రైలులో భారీ అగ్నిప్రమాదం.. క్షణాల్లో బూడిదైన బోగీ!

Saharsa Passenger Train Fire: ప్యాసింజర్ రైలులో భారీ అగ్నిప్రమాదం.. క్షణాల్లో బూడిదైన బోగీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2026
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లోని సహర్సా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమస్తిపూర్-సహర్సా ప్యాసింజర్ రైలు (నంబర్: 63344)లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిమ్రీ బఖ్తియార్‌పూర్ రైల్వే స్టేషన్‌లో తీవ్ర కలకలం నెలకొంది. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురై ప్రాణాలు కాపాడుకునేందుకు రైలు నుంచి బయటకు పరుగులు తీశారు. రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు వెంటనే స్పందించి అందరినీ సురక్షితంగా బయటకు తరలించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

వివరాలు

బ్యాటరీ బాక్స్ వద్ద ప్రారంభమైన మంటలు

సోమవారం ఉదయం సుమారు 3:40 గంటలకు సమస్తిపూర్ నుంచి సహర్సా వెళ్తున్న ప్యాసింజర్ రైలు సిమ్రీ బఖ్తియార్‌పూర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ నంబర్-2 వద్ద ఆగింది.

ఈ సమయంలో ఇంజిన్‌కు ఆనుకుని ఉన్న బోగీలోని బ్యాటరీ బాక్స్ సమీపంలో మొదట పొగ కనిపించింది.

తొలుత దీనిని సాధారణ సాంకేతిక లోపంగా భావించినా, కొద్ది నిమిషాల్లోనే మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. దీంతో ఒక బోగీ పూర్తిగా అగ్నికి ఆహుతైంది.

వివరాలు

వెంటనే స్పందించిన అధికారులు

ఘటన జరిగిన వెంటనే రైల్వే అధికారులు స్టేషన్‌లో అత్యవసర ప్రకటనలు చేస్తూ ప్రయాణికులు వెంటనే రైలు నుంచి దిగాలని సూచించారు.

అనంతరం ఆర్‌పీఎఫ్ (RPF), జీఆర్‌పీ (GRP) పోలీసులు, రైల్వే సిబ్బంది సమన్వయంతో ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు.

అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

దాదాపు గంటన్నరపాటు శ్రమించిన అనంతరం అగ్నిని పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అధికారుల వేగవంతమైన చర్యలతో పెద్ద ప్రమాదం తప్పింది.

ADVERTISEMENT

వివరాలు

రెండు గంటల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం

ఈ అగ్నిప్రమాదం కారణంగా సహర్సా-సమస్తిపూర్ రైల్వే మార్గంలో సుమారు రెండు గంటలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

పలు రైళ్లను మధ్యలో నిలిపివేయగా, మరికొన్నింటిని ఆలస్యంగా నడిపించారు.

ఈ ఘటన ప్రభావం మనిహారి-జయనగర్ జానకీ ఎక్స్‌ప్రెస్, కోసీ ఎక్స్‌ప్రెస్, దేవఘర్ ప్యాసింజర్ సహా మరికొన్ని రైళ్లపై పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు.

ADVERTISEMENT