Jammu And Kashmir: బారాముల్లా రహదారిపై విరిగిపడిన కొండచరియలు.. పరుగులు తీసిన జనం
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్లోని ఉత్తర ప్రాంతం,బారాముల్లా జిల్లాలో భారీగా కొండచరియల విరిగిపడ్డాయి. ఈ ప్రమాదం శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారిపై సంభవించింది. ఘటన సమయంలో అప్రమత్తతతో ఉన్న వాహనదారులు వెంటనే ప్రాణాలను రక్షించుకునేందుకు అక్కడి నుంచి పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ,ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఎవరికీ గాయాలూ కాలేదు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, ప్రస్తుతం ఆ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నందున కొండచరియలు విరిగినట్లు తెలిపింది.
వివరాలు
బారాముల్లా-ఉరి మార్గంలో పూర్తిగా స్తంభించిన రవాణా
ఈ సంఘటన కారణంగా ఆ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కొండపై నుంచి బండరాళ్లు కిందకు పడుతూనే ఉన్నాయని అధికారులు తెలిపారు. అందుకే ముందస్తు జాగ్రత్తగా ఆ హైవేపై వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఫలితంగా, బారాముల్లా-ఉరి మార్గంలోని రవాణా పూర్తిగా స్తంభించినట్లు వెల్లడించబడింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
Twitter Post
Road widening on the Baramulla–Uri highway is being executed with complete disregard for ecological and geological realities. Unscientific mountain cutting without proper studies has already led to repeated landslides.
— Faraz Ashraf (@faraazashraf_) January 2, 2026
Development cannot and must not come at the cost of… pic.twitter.com/8VCn0RI52C