No Indian Killed In Saudi Strike: సౌదీ ప్రొజెక్టైల్ ఘటన.. మృతుల్లో భారతీయులు లేరు.. ఇండియన్ ఎంబసీ పోస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
సౌదీ అరేబియాలోని నివాస ప్రాంతాల్లో సైనిక ప్రొజెక్టైల్ పడిపోవడంతో ఓ భారతీయుడు మృతిచెందాడంటూ వచ్చిన వార్తలపై తాజాగా స్పష్టత వచ్చింది. ఈ ఘటనపై అక్కడి భారత రాయబార కార్యాలయం స్పందిస్తూ, ఆ దాడిలో భారతీయుడు ఎవరూ మరణించలేదని వెల్లడించింది. ఈ విషయాన్ని ఎక్స్ (X) వేదికగా పోస్ట్ చేస్తూ అధికారికంగా తెలిపింది. అల్ఖర్జ్లోని నివాస ప్రాంతంలో ప్రొజెక్టైల్ పడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు సౌదీ అరేబియాకు చెందిన సివిల్ డిఫెన్స్ సంస్థ ముందుగా వెల్లడించింది. మొదట్లో మృతుల్లో భారత్, బంగ్లాదేశ్కు చెందిన వ్యక్తులు ఉన్నారని సమాచారం ఇచ్చింది. అయితే తరువాత మృతుల వివరాలపై మరింత స్పష్టత ఇస్తూ, చనిపోయిన ఇద్దరూ బంగ్లాదేశ్ పౌరులేనని ప్రకటించింది.
వివరాలు
అల్ఖర్జ్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతీయుడు
ఈ ఘటనలో మొత్తం 12 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ఒక భారతీయుడు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం స్పందిస్తూ, "నిన్న సాయంత్రం అల్ఖర్జ్లో జరిగిన దాడిలో భారతీయుడు ఎవరూ మరణించలేదు. ఇది కొంత ఊరటనిచ్చే విషయం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలపై స్థానిక అధికారులతో మేము నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నాం. గాయపడిన భారతీయుడు ప్రస్తుతం అల్ఖర్జ్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు" అని ఎక్స్ వేదికగా వెల్లడించింది.