NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Meghalaya honeymoon murder: రాజా రఘువంశీ అంత్యక్రియల్లో పాల్గొన్న సోనమ్ ప్రియుడు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Meghalaya honeymoon murder: రాజా రఘువంశీ అంత్యక్రియల్లో పాల్గొన్న సోనమ్ ప్రియుడు 
    రాజా రఘువంశీ అంత్యక్రియల్లో పాల్గొన్న సోనమ్ ప్రియుడు

    Meghalaya honeymoon murder: రాజా రఘువంశీ అంత్యక్రియల్లో పాల్గొన్న సోనమ్ ప్రియుడు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 10, 2025
    11:09 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మేఘాలయలో హనీమూన్‌కు వెళ్లిన కొత్త వధూవరుల అదృశ్య ఘటన ఊహించని మలుపు తిరిగింది.

    ఈ కేసులో భార్యే భర్తను పథకం ప్రకారం హత్య చేయించిందన్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది.

    ఇప్పుడు ఈ కేసులో మరో కీలక అంశం బయటపడింది. భర్తను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన రాజ్ కుశ్యాహా, మరణించిన రఘువంశీ అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నట్టు తాజా సమాచారం వెల్లడైంది.

    ఈ విషయాన్ని రఘువంశీ కుటుంబసభ్యులు స్వయంగా వెల్లడించారు.

    ఇప్పటికే రఘువంశీ హత్య కేసులో అతడి భార్య సోనమ్‌తో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

    వివరాలు 

     రఘువంశీ అంత్యక్రియల్లో కుశ్యాహా 

    వారిలో రాజ్ కుశ్యాహా అనే నిందితుడు, సోనమ్‌తో అత్యంత సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    ఇదే క్రమంలో, రఘువంశీ అంత్యక్రియల్లో కుశ్యాహా పాల్గొన్న వీడియోను మృతుడి సోదరి సోషల్ మీడియా వేదికగా 'ఎక్స్'లో పోస్టు చేశారు.

    రఘువంశీ మృతదేహం వెలికి తీసిన తర్వాత దాన్ని ఇందౌర్‌కు తరలించేందుకు కుటుంబ సభ్యులు నాలుగు వాహనాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

    అందులో ఒక వాహనాన్ని నిందితుడే నడిపాడని వారు వెల్లడించారు.అంతేకాదు,సోనమ్ తండ్రిని ఓదార్చే పనిలో కూడా అతడు పాల్గొన్నాడని చెప్పారు.

    అరెస్టు జరిగిన తరువాతే అతడు నిందితుడన్న విషయం తమకు తెలిసిందని చెప్పారు.

    వివరాలు 

    నలుగురు నిందితుల అరెస్ట్

    హత్యలో తన పాత్రను ఎవ్వరూ గుర్తించకుండా ఉండేందుకే కుశ్యాహా, రఘువంశీ కుటుంబానికి అత్యంత విధేయుడిలా, నమ్మకంగా వ్యవహరించినట్టు అనుమానం వ్యక్తమవుతోంది.

    ఇందౌర్‌కు చెందిన సోనమ్,రఘువంశీ దంపతులు మే 20న మేఘాలయకు హనీమూన్‌కి వెళ్లిన తర్వాత కనిపించకుండా పోయారు.

    ఆపై జూన్ 2న రఘువంశీ మృతదేహాన్ని పోలీసులు లోయలో గుర్తించారు.

    అప్పటివరకు కనిపించని సోనమ్ కోసం విస్తృతంగా గాలింపు చేపట్టగా,ఆమె ఉత్తరప్రదేశ్‌లోని గాజీపుర్ జిల్లాలో పోలీసుల ఎదుట లొంగిపోయింది.

    అనంతరం నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, సోనమ్ భర్తను హత్య చేయించినట్టు వారు వెల్లడించారు.

    అయితే, ఈ హత్యలో తనకు ఎలాంటి పాత్ర లేదని, తాను హత్య చేయించలేదని సోనమ్ పోలీసులకు తెలిపింది. తనను ఎవరో అపహరించారని కూడా ఆమె పేర్కొనడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇండోర్

    తాజా

    Meghalaya honeymoon murder: రాజా రఘువంశీ అంత్యక్రియల్లో పాల్గొన్న సోనమ్ ప్రియుడు  ఇండోర్
    Dharmapuri Arvind: పసుపు రైతులకు శుభవార్త.. జూన్‌లో ప్రారంభం కానున్న జాతీయ బోర్డు కార్యాలయం! నిజామాబాద్
    IAF: 'శుభాంశు కొత్త అధ్యాయం లిఖించాలి'.. శుక్లాకు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ శుభాకాంక్షలు  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు తగ్గుముఖం.. వెండి ధరలు నిలకడగా! బంగారం

    ఇండోర్

    INDvsAUS : ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే టీమిండియా ఓడిపోయింది క్రికెట్
    ఇండోర్ పిచ్‌పై ఐసీసీకి బీసీసీఐ అప్పీల్ క్రికెట్
    ఇండోర్ ఆలయంలో కూలిపోయిన మెట్లబావి; 13మంది మృతి మధ్యప్రదేశ్
    ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య మధ్యప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025