NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Manipur: మణిపూర్ గ‌వ‌ర్న‌ర్‌కు ఆయుధాలను సమర్పించిన మైతీ తెగ‌కు చెందిన అరంబై తెంగోల్ సభ్యులు
    తదుపరి వార్తా కథనం
    Manipur: మణిపూర్ గ‌వ‌ర్న‌ర్‌కు ఆయుధాలను సమర్పించిన మైతీ తెగ‌కు చెందిన అరంబై తెంగోల్ సభ్యులు
    Manipur: మణిపూర్ గ‌వ‌ర్న‌ర్‌కు ఆయుధాలను సమర్పించిన అరంబై తెంగోల్ సభ్యులు

    Manipur: మణిపూర్ గ‌వ‌ర్న‌ర్‌కు ఆయుధాలను సమర్పించిన మైతీ తెగ‌కు చెందిన అరంబై తెంగోల్ సభ్యులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 27, 2025
    05:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మైతీ వర్గానికి చెందిన అరంబై తెంగోల్ గ్రూపు సభ్యులు ఇవాళ మణిపూర్ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు తమ ఆయుధాలను అప్పగించారు.

    ఫిబ్రవరి 25న గవర్నర్ భల్లాతో జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

    మణిపూర్‌లో గత కొంతకాలంగా రెండు తెగల మధ్య జరుగుతున్న ఘర్షణలు తీవ్రంగా మారిన విషయం తెలిసిందే.

    ఈ హింసాత్మక సంఘటనల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు.

    వివరాలు 

    104 తుపాకులు, మందుగుండు సామగ్రి స‌రెండ‌ర్ 

    రాష్ట్రంలోని ఆరు ప్రధాన జిల్లాల్లో అరంబై తెంగోల్ సభ్యులు మొత్తం 104 తుపాకులు, భారీ సంఖ్యలో మందుగుండు సామగ్రిని ప్రభుత్వానికి అప్పగించారు.

    ఆయుధాలను కంగ్‌పోప్కీ, ఇంపాల్ ఈస్ట్, బిష్ణుపుర్, తౌబాల్, ఇంపాల్ వెస్ట్, కాక్‌చింగ్ జిల్లాల్లో సమర్పించారు.

    ఫిబ్రవరి 20న గవర్నర్ భల్లా, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి, అక్రమంగా లూటీ చేసిన ఆయుధాలను వారం రోజుల్లోగా ప్రభుత్వానికి అప్పగించాలని విజ్ఞప్తి చేసిన విషయం గుర్తించాలి.

    వివరాలు 

    ప్రభుత్వ హామీ - ఎటువంటి చర్యలు ఉండవు 

    ఈ పరిణామాల నేపథ్యంలో అరంబై తెంగోల్ గ్రూపు సభ్యులు తమ ఆయుధాలను అధికారికంగా సమర్పించారు.

    ఆయుధాలను అప్పగించిన వారిపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

    మైతీ గ్రూపు కూడా తమ షరతులను ప్రభుత్వం అంగీకరిస్తే ఆయుధాలను సమర్పిస్తామని తెలిపింది.

    ఈ సందర్భంగా ఆ గ్రూపు ప్రతినిధి రాబిన్ మాన్‌గంగ్ కవైరక్‌పార్ గవర్నర్‌ను కలిసి చర్చలు జరిపారు.

    అయితే ఆయుధాల సమర్పణకు ప్రత్యేక గడువు ప్రకటించలేదు.

    వివరాలు 

    ఎస్టీ హోదా కోసం అరంబై తెంగోల్ డిమాండ్ 

    గవర్నర్ భల్లాకు అరంబై తెంగోల్ సభ్యులు ఓ మెమోరాండం సమర్పించారు. మేజారిటీ మైతీ వర్గానికి ఎస్టీ హోదా ఇవ్వాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు.

    మైతీ తెగలకు ఎస్టీ హోదా కల్పించాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా 2023మేలో మణిపూర్‌లో పెద్ద ఎత్తున నిరసనలూ, ఆందోళనలూ జరిగాయి.

    ఆ తర్వాత హింసాత్మక ఘటనలు మూడుపట్ల ఎక్కువయ్యాయి. కుక్కీ గిరిజనులపై దాడులు జరిపినట్లు అరంబై తెంగోల్ గ్రూపుపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.

    ఇప్పటివరకు కేవలం 2500 ఆయుధాలే స‌రెండ‌ర్

    హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న సమయంలో అరాచక శక్తులు పోలీస్ స్టేషన్లు, ఔట్ పోస్టుల వద్ద ఉన్న ఆయుధాలను ఆక్రమించుకున్నాయి.

    అప్పటి నుంచి సుమారు 6000 ఆయుధాలు లూటీకి గురవగా,ఇప్పటివరకు కేవలం 2500ఆయుధాలే ప్రభుత్వానికి అప్పగించారు.

    వివరాలు 

    ఈ ఘర్షణల్లో 260 మంది ప్రాణాలు కోల్పోయారు 

    ఈ ఘర్షణల్లో మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 60,000 మంది నిరాశ్రయులయ్యారు.

    మైతీలు ప్రధానంగా హిందూ మతస్థులు, వీరిలో ఎక్కువ శాతం ఇంపాల్ లోయ ప్రాంతాల్లో నివసిస్తారు. కుక్కీలు ఎక్కువగా క్రైస్తవులు, వీరు కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటారు.

    ప్రస్తుతం ఈ రెండు వర్గాల మధ్య మరింత ఘర్షణలు తలెత్తకుండా ప్రభుత్వ భద్రతా దళాలు బలోపేతమైన "బఫర్ జోన్లు" ఏర్పాటు చేశాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    గ‌వ‌ర్న‌ర్‌కు ఆయుధాలను సమర్పించడానికి వచ్చిన అరంబై తెంగోల్ సభ్యులు

    #WATCH | Imphal | The members of 'Arambai Tengol'- a Meitei organisation, today surrendered their arms following their meeting with Manipur Governor Ajay Kumar Bhalla on Feb 25 pic.twitter.com/J8NIc1LkI0

    — ANI (@ANI) February 27, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మణిపూర్

    తాజా

    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,600 స్టాక్ మార్కెట్
    Flood Situation: ఈశాన్యంలో ప్రకృతి ప్రళయం.. వరదల బీభత్సంతో 43 మంది మృతి వరదలు
    Cash Row: జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభిశంసనకు కేంద్రం రంగం సిద్ధం  కేంద్ర ప్రభుత్వం
    Andhra Pradesh: ఏపీలో నేషనల్ హైవే ఆరు లైన్లుగా.. కేంద్రం ముందుకు ప్రతిపాదనలు శ్రీకాకుళం

    మణిపూర్

    Manipur: మోరేలో నిద్రిస్తున్న సిబ్బందిపై ఉగ్రవాదులు మెరుపుదాడి.. మణిపూర్ భద్రతా అధికారి మృతి  భారతదేశం
    Manipur: మణిపూర్‌లో పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌పై సాయుధుల దాడి.. 3 బోర్డర్ ఫోర్స్ సిబ్బందికి గాయాలు  భారతదేశం
    Manipur : తాజా హింసాకాండలో ఐదుగురు పౌరులు మృతి  భారతదేశం
    Manipur: మణిపూర్ లో మరోసారి హింస..ముగ్గురు మృతి..30మందికి పైగా గాయాలు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025