Loading...
Melstar Aviation: ఏవియేషన్‌ పెట్టుబడులకు మెల్‌స్టార్‌ ఆసక్తి.. మంత్రితో సంస్థ డైరెక్టర్‌ భేటీ
ఏవియేషన్‌ పెట్టుబడులకు మెల్‌స్టార్‌ ఆసక్తి.. మంత్రితో సంస్థ డైరెక్టర్‌ భేటీ

Melstar Aviation: ఏవియేషన్‌ పెట్టుబడులకు మెల్‌స్టార్‌ ఆసక్తి.. మంత్రితో సంస్థ డైరెక్టర్‌ భేటీ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2026
09:34 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏవియేషన్‌ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మెల్‌స్టార్‌ ఏవియేషన్‌ ఆసక్తి చూపించింది. విజయవాడ విమానాశ్రయంలో ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీరింగ్‌ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించేందుకు సంస్థ ప్రతిపాదించింది. అలాగే భోగాపురం, కర్నూలు, విజయవాడ విమానాశ్రయాల్లో పూర్తిస్థాయి మెయింటెనెన్స్‌, రిపేర్‌ అండ్‌ ఓవర్‌హాలింగ్‌ (ఎంఆర్‌ఓ) కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈ పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చించేందుకు మెల్‌స్టార్‌ ఏవియేషన్‌ డైరెక్టర్‌ తరుణ్‌ కశ్యప్‌ గురువారం సచివాలయంలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా కర్నూలు విమానాశ్రయంలో ఏర్పాటు చేస్తున్న మెల్‌స్టార్‌ ఏవియేషన్‌ లెర్నింగ్‌ అకాడమీలో పైలట్‌ శిక్షణ కేంద్రం పనుల పురోగతిని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఏవియేషన్‌ రంగం వేగంగా విస్తరిస్తోందని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు.

వివరాలు 

లాజిస్టిక్స్‌ రంగంలో రూ.300 కోట్ల పెట్టుబడికి ఆసక్తి

రాష్ట్రాన్ని ఏవియేషన్‌ హబ్‌గా అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని చెప్పారు.

పెట్టుబడులకు సంబంధించిన పూర్తిస్థాయి ప్రతిపాదనలతో రావాలని మెల్‌స్టార్‌ ఏవియేషన్‌ ప్రతినిధులకు మంత్రి సూచించారు.

రాష్ట్రంలో రైల్వే అనుసంధానిత మల్టీమోడల్‌ లాజిస్టిక్స్‌ హబ్‌లను అభివృద్ధి చేసేందుకు శ్రీక్షేత్ర లాజిస్టిక్స్‌ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది.

ఈ రంగంలో దాదాపు రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

శ్రీక్షేత్ర లాజిస్టిక్స్‌ డైరెక్టర్‌ వివేక్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డిని కలిసి సంస్థ ప్రతిపాదనలను వివరించింది.

పూర్తిస్థాయి ప్రాజెక్టు ప్రతిపాదనలతో వస్తే ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.

ADVERTISEMENT