LOADING...
Vande Mataram: వందేమాతరమే ముందుగా ఆలపించాలి.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు
వందేమాతరమే ముందుగా ఆలపించాలి.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు

Vande Mataram: వందేమాతరమే ముందుగా ఆలపించాలి.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 11, 2026
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

జాతీయ గేయం 'వందేమాతరం', జాతీయ గీతం 'జనగణమన' ఆలాపనకు సంబంధించి కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏ రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్ర గీతం ఉన్నప్పటికీ, అధికారిక కార్యక్రమాల్లో ముందుగా వందేమాతరం, అనంతరం జనగణమన ఆలపించాలని స్పష్టం చేసింది. ఈ రెండింటి తర్వాతే రాష్ట్ర గీతాన్ని పాడాలని పేర్కొంది. ఇటీవల తమిళనాడులో జరిగిన కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వందేమాతరం, జనగణమన అనంతరం తమిళ రాష్ట్ర గీతాన్ని ఆలపించడంపై రాజకీయంగా చర్చ సాగిన నేపథ్యంలో కేంద్రం ఈ తాజా ఆదేశాలను జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వివరాలు 

3 నిమిషాల 10 సెకన్ల నిడివి గల వందేమాతరంనే ఆలపించాలి 

కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, జాతీయ గీతం, జాతీయ గేయంతో పాటు రాష్ట్ర గీతాన్ని కూడా ఆలపించే సంప్రదాయం ఉన్న కార్యక్రమాల్లో ముందుగా వందేమాతరం, ఆ తర్వాత జనగణమన, చివరగా రాష్ట్ర గీతాన్ని ఆలపించాల్సి ఉంటుంది. అలాగే అధికారిక కార్యక్రమాల్లో 3 నిమిషాల 10 సెకన్ల నిడివి గల ఆరు చరణాల అధికారిక రూపంలోని వందేమాతరంనే ఆలపించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఆలాపన సమయంలో ఎలాంటి పదప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారిక లిపి, పద వినియోగంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పులు చేయరాదని మార్గదర్శకాల్లో పేర్కొంది.

Advertisement