NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్.. డబ్బులు, మద్యం పంచుకుండా గెలిపించాలని సూచన
    తదుపరి వార్తా కథనం
    సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్.. డబ్బులు, మద్యం పంచుకుండా గెలిపించాలని సూచన
    సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్

    సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్.. డబ్బులు, మద్యం పంచుకుండా గెలిపించాలని సూచన

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 20, 2023
    05:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రభుత్వం విద్యా దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ నేపథ్యంలో మంత్రి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

    తొలుత నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేటలో పాఠశాల సముదాయ భవనాలను ప్రారంభించారు. దీని నిర్మాణానికి ప్రభుత్వం రూ. 8 కోట్ల నిధులను వెచ్చించింది.

    అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి, కరీంనగర్‌ ఎంపీతో ప్రజలకు అరపైసా న్యాయం జరగలేదన్నారు. ప్రజల దయ ఉంటే మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తానని, ఆ మేరకు పనిచేస్తానని చెప్పుకొచ్చారు.

    అయితే ఎన్నికల్లో తాను మద్యం పంపిణీ చేయనని, పైసలు కూడా ఇవ్వననే విషయం సిరిసిల్ల ప్రజలకు, తనకు తెలుసన్నారు.

    DETAILS

    అప్పట్లో స్కూళ్లు ఎలా ఉండేవో, ఇప్పుడెలా ఉన్నాయో పోల్చి చూడాలి : మంత్రి కేటీఆర్

    50 సంవత్సరాల్లో పనులేవీ చేయని నేతలు ఇప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూడకుండా, కేవలం చిన్న చిన్న పొరపాట్లను పట్టుకుంటున్నారన్నారు.

    ప్రపంచంలో ఎక్కడికెళ్లినా తెలంగాణ ప్రజలు కలుస్తుంటారని, గ్రామీణ ప్రాంతాల్లో చదివిన వారు అగ్రరాజ్యంలో ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. అయితే వీరు ఉన్నత స్థానం చేరేందుకు ఉపాధ్యాయులే కారణమన్నారు.

    9 ఏళ్ల క్రితం బడులు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడాలన్నారు. భూముల ధరలను సైతం ఒకప్పుడు ఎలా ఉండేవో, ఇప్పుడెలా మారాయో ఆలోచించాలని కోరారు.

    త్వరలోనే ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కాలేజీ వస్తుందని, ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంటే అన్ని అవే వస్తాయన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సిరిసిల్ల
    తెలంగాణ
    ప్రభుత్వం

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    సిరిసిల్ల

    ఒకే కాన్పులో నలుగురు శిశువులు జననం; రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరుదైన ఘటన తెలంగాణ
    సిరిసిల్ల చీరలు, కరీనంగర్ ఫిలిగ్రీ ఆర్ట్; ఎల్లలు దాటిన తెలంగాణ హస్తకళా వైభవం  తెలంగాణ

    తెలంగాణ

    తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 31% వృద్ధి; 1.27లక్షల కొత్త ఉద్యోగాలు: కేటీఆర్  ఉద్యోగుల తొలగింపు
    నేనేక్కడికి వెళ్లను.. బీజేపీలోనే ఉంటా : విజయశాంతి  హైదరాబాద్
    నిండు వేసవిలో గేట్లు తెరుచుకున్న మూసీ.. 25 ఏళ్లలో ఇదే తొలిసారి భారతదేశం
    హస్తం గూటికే జూపల్లి, పొంగులేటి - నెలాఖరులోగా చేరికలకు ముహూర్తం కాంగ్రెస్

    ప్రభుత్వం

    కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారు; ఈ నెలఖరులోనే!  నరేంద్ర మోదీ
    తెలంగాణ: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ నెల నుంచే సన్నబియ్యంతో భోజనం  తెలంగాణ
    'జగనన్నకు చెబుదాం'లో ఎలా ఫిర్యాదు చేయాలి? ఏ సమస్యకు పరిష్కారం లభిస్తుంది? ఆంధ్రప్రదేశ్
    తెలంగాణలో వరి విలువ ఏటికేడు రెట్టింపు తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025