NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Cabinet Key Decisions: 9 అంశాలపై మంత్రిమండలి సమావేశంలో చర్చ.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    AP Cabinet Key Decisions: 9 అంశాలపై మంత్రిమండలి సమావేశంలో చర్చ.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్..
    పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్..

    AP Cabinet Key Decisions: 9 అంశాలపై మంత్రిమండలి సమావేశంలో చర్చ.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 03, 2025
    05:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 9 ప్రధాన అంశాలపై చర్చించారు.

    కేబినెట్ కీలకంగా బార్ లైసెన్స్ ఫీజును రూ. 25 లక్షలకు తగ్గించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

    అలాగే, యువజన, పర్యాటక శాఖలో జీవోల ర్యాటిఫికేషన్‌కు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది.

    ఏపీ మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు - 2025కి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదనంగా, సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు మంజూరు చేసింది.

    ప్రభుత్వం జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా పోలవరం - బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ రూపకల్పన చేయనుంది.

    వివరాలు 

    మంత్రి కొలుసు పార్థసారథి వివరణ 

    అంతేకాకుండా, రూ. 710 కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

    కేబినెట్ సమావేశం అనంతరం, మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు.

    రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆయన తెలిపారు.

    ఆర్‌సెల్ మిట్టల్ నిస్సార్ ఇండియా లిమిటెడ్ స్టీల్ ఉత్పత్తి ప్రతిపాదనకు కేబినెట్ అనుమతి ఇచ్చింది.

    ఈ స్టీల్ ప్లాంట్ వల్ల ఉద్యోగ అవకాశాలు భారీగా పెరగనున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.

    టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. త్రి-స్టార్ హోటళ్లలో గదుల సంఖ్య పెరగాలని, టూరిజం శాఖ ఈ దిశగా చర్యలు తీసుకుంటోంది.

    వివరాలు 

    పోలవరం - బనకచర్ల ప్రాజెక్ట్ పై ప్రత్యేక చర్యలు 

    పోలవరం - బనకచర్ల ప్రాజెక్ట్ అమలుకు "జలహారతి కార్పొరేషన్" పేరుతో ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆమోదించింది.

    ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

    ప్రతి ఏడాది 1000 నుంచి 2000 టీఎంసీల నీరు వృధాగా పోతుండటంతో, రాయలసీమ అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ అత్యవసరమని కేబినెట్ అభిప్రాయపడింది.

    గ్రామీణాభివృద్ధి కోసం అధికారులు నేరుగా గ్రామాల్లో ఉండి ప్రజల సమస్యలను అర్థం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.

    వివరాలు 

    మత స్వేచ్ఛ,వక్ఫ్ బిల్లుపై టీడీపీ విధానం 

    ప్రభుత్వ లక్ష్యం అన్ని మత విశ్వాసాలను గౌరవించడం అని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. వక్ఫ్ బిల్లులో మార్పుల అవసరంపై ఇప్పటికే టీడీపీ తన సూచనలు అందించిందని ఆయన గుర్తుచేశారు.

    ముఖ్యాంశాలు:

    బార్ లైసెన్స్ ఫీజు రూ. 25 లక్షలకు తగ్గింపు

    ఏపీ మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు - 2025 ఆమోదం

    పోలవరం - బనకచర్ల ప్రాజెక్ట్ అమలుకు "జలహారతి కార్పొరేషన్" ఏర్పాటు

    రూ. 710 కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ

    వైజాగ్ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి ప్రభుత్వ ప్రణాళికలు

    గ్రామీణాభివృద్ధికి అధికారుల ప్రత్యక్ష పాల్గొనలపై సీఎం ఆదేశం

    టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక దృష్టి

    అన్ని మత విశ్వాసాలకు గౌరవం - వక్ఫ్ బిల్లుపై టీడీపీ సూచనలు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    కొలుసు పార్థసారథి

    తాజా

    Saiyami Kher : తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు  టాలీవుడ్
    Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా డైరీ స్వాధీనం చేసుకున్న హర్యానా పోలీసులు.. డైరీలో ఆ దేశంపై ప్రశంసలు జ్యోతి మల్హోత్రా
    Motivation : విజయం కావాలంటే... ముందు నిన్ను నువ్వు నమ్ముకో! జీవనశైలి
    Cannes 2025: కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అదిరిపోయిన జాన్వీకపూర్‌ లుక్.. ఫొటోలు వైరల్‌ జాన్వీ కపూర్

    ఆంధ్రప్రదేశ్

    #NewsBytesExplainer: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన మావోయిస్టుల ఆధిపత్యం.. ఉనికి ప్రశ్నార్థకమా? తెలంగాణ
    AP Best Legislator Award: ఏపీలో శాసనసభ సభ్యులకు ఉత్తమ లెజిస్లేటర్ అవార్డులు.. సిద్ధమైన ప్రణాళిక! భారతదేశం
    Kakinada: కాకినాడలో దారుణ ఘటన.. పిల్లలను హత్య చేసి ఉరేసుకున్న తండ్రి కాకినాడ సిటీ
    CM Chandrababu: 47 ఏళ్ల క్రితం ఇదే రోజు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు

    కొలుసు పార్థసారథి

    Kolusu Parthasarathy: వైసీపీ నుండి మరో ఎమ్యెల్యే ఔట్ .. ఈ నెల 18న టిడిపిలోకి..  భారతదేశం
    Kolusu Parthasarathy: నాకు ఆలా చెయ్యడం రాదనేమో: వైసీపీ ఎమ్యెల్యే కొలుసు పార్థసారథి  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025