
Delhi: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. జన్పథ్ రోడ్డు లోని CCS బిల్డింగ్లో చెలరేగిన మంటలు..!
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో మరోసారి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
జన్పథ్ రోడ్డులో ఉన్న CCS భవనంలో ఆకస్మికంగా భారీ మంటలు చెలరేగాయి. ఈ భవనంలోని కార్యాలయాల్లో ఢిల్లీ సెక్రటేరియట్తో పాటు అనేక కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు కూడా ఉన్నాయి.
ప్రమాదం జరిగిందన్న సమాచారం అందిన వెంటనే అధికారులు స్పందించి తక్షణమే రక్షణ చర్యలు ప్రారంభించారు.
ఘటనాస్థలికి మొత్తం 13 అగ్నిమాపక వాహనాలు చేరుకున్నాయి. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే మంటలను అదుపులోకి తెచ్చారు.
వివరాలు
వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో.. ఈ తరహా అగ్నిప్రమాదాలు
ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఢిల్లీలో వేసవి తీవ్రత విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఈ తరహా అగ్నిప్రమాదాలు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణమని భావిస్తున్నారు.
CCS భవనంలో చెలరేగిన ఈ మంటల ఘటనపై అధికారులు కీలక సమాచారం వెల్లడించారు.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని స్పష్టం చేశారు.
అయితే, ఆస్తి నష్టం మాత్రం తీవ్రమైనదిగా గుర్తించారు.
ముఖ్యంగా ఈ భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న ఫర్నిచర్లో మంటలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు.
మొత్తం 15 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకొని మంటల అదుపులో కీలక పాత్ర పోషించాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
CCS బిల్డింగ్లో చెలరేగిన మంటలు..
जनपथ रोड पर निर्माणाधीन CCS 2 बिल्डिंग में लगी आग। किसी के हताहत होने की खबर नहीं, दमकल विभाग ने आग पर काबू पाया। @DelhiPolice pic.twitter.com/zvRCVy0Y6Q
— Rajesh Kumar (@jagranrajesh123) June 14, 2025