NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాజస్థాన్‌లో రూ.5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ; ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు 
    రాజస్థాన్‌లో రూ.5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ; ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు 
    1/3
    భారతదేశం 1 నిమి చదవండి

    రాజస్థాన్‌లో రూ.5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ; ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు 

    వ్రాసిన వారు Naveen Stalin
    May 10, 2023
    03:19 pm
    రాజస్థాన్‌లో రూ.5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ; ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు 
    రాజస్థాన్‌లో రూ.5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ; ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు

    రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలోని నాథ్‌ద్వారాలో జరిగిన కార్యక్రమంలో రూ. 5,500 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ఎదురుదాడికి దిగారు. దేశంలో మంచి జరగాలని కొందరు కోరుకోవడం లేదని ప్రధాని మోదీ మండిపడ్డారు. ప్రతిదాన్ని ఓట్లతో కొలిచే వారు దేశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించలేకపోతున్నారని అన్నారు. అయితే ప్రాధాని మోదీ ఎవరి పేరు చెప్పకుండా ఇలా విమర్శలు చేయడం గమనార్హం. వారు వివాదాలు సృష్టించడం మాత్రమే ఇష్టపడతారని మోదీ స్పష్టం చేశారు. సుస్థిర, వేగవంతమైన అభివృద్ధి కోసం ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన అవసరమని చరిత్ర చెబుతోందని పేర్కొన్నారు.

    2/3

    ఈ శంకుస్థాపనలు మోదీ వ్యూహాత్మకంలో భాగమేనా?

    ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రధాని వ్యూహాత్మకంగానే భారీగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపపలను చేసినట్లు తెలుస్తోంది. అభివృద్ధి పనులను ప్రధాని మోదీ శంకు స్థాపన చేసిన సమయంలో ఆయన పక్కన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా ఉన్నారు. రాజ్‌సమంద్, ఉదయ్‌పూర్‌లలో రెండు-లేన్‌లుగా అప్‌గ్రేడ్ చేయడానికి, ఉదయ్‌పూర్ రైల్వే స్టేషన్‌ను పునరాభివృద్ధి చేయడానికి, రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. గేజ్ కన్వర్షన్ ప్రాజెక్ట్, రాజ్‌సమంద్‌లోని నాథ్‌ద్వారా నుంచి నాథ్‌ద్వారా పట్టణం వరకు కొత్త లైన్ ఏర్పాటుకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఎన్‌హెచ్-48లో ఆరు లేన్‌లు, ఎన్‌హెచ్-25లో 4లేన్‌ల నిర్మాణం సహా మూడు జాతీయ రహదారి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు.

    3/3

    అశోక్ గెహ్లోట్‌తో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించిన మోదీ

    Prime Minister Narendra Modi dedicates and lays the foundation stone of infrastructure projects worth over Rs 5,500 crores in Nathdwara, Rajasthan. pic.twitter.com/7T7EfZ4p1n

    — ANI (@ANI) May 10, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    రాజస్థాన్
    తాజా వార్తలు

    నరేంద్ర మోదీ

    సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం; ఈసీకి ఫిర్యాదు  కర్ణాటక
    కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారు; ఈ నెలఖరులోనే!  ప్రధాన మంత్రి
    మోదీ జీ, మీ మాట కోసమే న్యాయం వేచి చేస్తోంది: ప్రియాంక గాంధీ  ప్రియాంక గాంధీ
    Mann ki Baat 100th Episode: ప్రజలతో కనెక్ట్ అవడానికి 'మన్ కీ బాత్' నాకు మార్గాన్ని చూపింది: ప్రధాని మోదీ  మన్ కీ బాత్

    ప్రధాన మంత్రి

    'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్; వంద ఇసుక రేడియోలతో అబ్బురపరిచే సైకత శిల్పం మన్ కీ బాత్
    కాంగ్రెస్ నన్ను 91సార్లు దుర్భాషలాడింది: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఫైర్ కర్ణాటక
    91ఎఫ్‌ఎం ట్రాన్స్‌మీటర్ల ప్రారంభంతో రేడియో పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    'నా కూతురు తన భర్తను ప్రధానిని చేసింది': రిషి సునక్‌పై సుధా మూర్తి ఆసక్తికర కామెంట్స్ బ్రిటన్

    రాజస్థాన్

    సచిన్ పైలెట్ 'జన్ సంఘర్ష్ యాత్ర'; అశోక్ గెహ్లాట్‌పై మరోసారి ఫైర్ అశోక్ గెహ్లాట్
    రాజస్థాన్‌: మిగ్-21 యుద్ధ విమానం కూలి నలుగురు మృతి యుద్ధ విమానాలు
    SEEI: ఇంధన పొదుపు సూచీలో టాప్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంధనం
    రాజస్థాన్: దిల్లీ-జైపూర్-అజ్మీర్ వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన మోదీ  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    తాజా వార్తలు

    యూకే: ముగ్గురు వ్యక్తుల DNAతో శిశువు జననం బ్రిటన్
    ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత పాకిస్థాన్‌లో హింస; కాల్పుల్లో ఆరుగురు మృతి పాకిస్థాన్
    తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చూసుకోండి తెలంగాణ
    గో ఫస్ట్ విమానాల కోసం లీజుదార్లతో టాటా, ఇండిగో విడివిడిగా చర్చలు టాటా
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023