NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాజస్థాన్‌లో రూ.5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ; ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు 
    తదుపరి వార్తా కథనం
    రాజస్థాన్‌లో రూ.5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ; ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు 
    రాజస్థాన్‌లో రూ.5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ; ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు

    రాజస్థాన్‌లో రూ.5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ; ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు 

    వ్రాసిన వారు Stalin
    May 10, 2023
    03:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలోని నాథ్‌ద్వారాలో జరిగిన కార్యక్రమంలో రూ. 5,500 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ఎదురుదాడికి దిగారు.

    దేశంలో మంచి జరగాలని కొందరు కోరుకోవడం లేదని ప్రధాని మోదీ మండిపడ్డారు. ప్రతిదాన్ని ఓట్లతో కొలిచే వారు దేశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించలేకపోతున్నారని అన్నారు.

    అయితే ప్రాధాని మోదీ ఎవరి పేరు చెప్పకుండా ఇలా విమర్శలు చేయడం గమనార్హం.

    వారు వివాదాలు సృష్టించడం మాత్రమే ఇష్టపడతారని మోదీ స్పష్టం చేశారు.

    సుస్థిర, వేగవంతమైన అభివృద్ధి కోసం ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన అవసరమని చరిత్ర చెబుతోందని పేర్కొన్నారు.

    మోదీ

    ఈ శంకుస్థాపనలు మోదీ వ్యూహాత్మకంలో భాగమేనా?

    ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రధాని వ్యూహాత్మకంగానే భారీగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపపలను చేసినట్లు తెలుస్తోంది.

    అభివృద్ధి పనులను ప్రధాని మోదీ శంకు స్థాపన చేసిన సమయంలో ఆయన పక్కన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా ఉన్నారు.

    రాజ్‌సమంద్, ఉదయ్‌పూర్‌లలో రెండు-లేన్‌లుగా అప్‌గ్రేడ్ చేయడానికి, ఉదయ్‌పూర్ రైల్వే స్టేషన్‌ను పునరాభివృద్ధి చేయడానికి, రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

    గేజ్ కన్వర్షన్ ప్రాజెక్ట్, రాజ్‌సమంద్‌లోని నాథ్‌ద్వారా నుంచి నాథ్‌ద్వారా పట్టణం వరకు కొత్త లైన్ ఏర్పాటుకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఎన్‌హెచ్-48లో ఆరు లేన్‌లు, ఎన్‌హెచ్-25లో 4లేన్‌ల నిర్మాణం సహా మూడు జాతీయ రహదారి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అశోక్ గెహ్లోట్‌తో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించిన మోదీ

    Prime Minister Narendra Modi dedicates and lays the foundation stone of infrastructure projects worth over Rs 5,500 crores in Nathdwara, Rajasthan. pic.twitter.com/7T7EfZ4p1n

    — ANI (@ANI) May 10, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    రాజస్థాన్
    తాజా వార్తలు

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    నరేంద్ర మోదీ

    ఢిల్లీ పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష నామినీ అజయ్ బంగా ప్రపంచం
    One World TB Summit: 2025 నాటికి టీబీని నిర్మూలించడమే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం 4% పెంచిన కేంద్రం ప్రభుత్వం
    'సబ్ కా ప్రయాస్'తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతోంది: ప్రధాని మోదీ ప్రధాన మంత్రి

    ప్రధాన మంత్రి

    నెహ్రూ కుటుంబాన్ని అవమానించారని ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ కాంగ్రెస్
    ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరిన సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    వేసవిలో ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు బైడన్ ఆతిథ్యం; వైట్‌హౌస్ ఏర్పాట్లు నరేంద్ర మోదీ
    గత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు; ఎందుకిలా? కర్ణాటక

    రాజస్థాన్

    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ భారతదేశం
    ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా? ప్రధాన మంత్రి
    ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశం
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం

    తాజా వార్తలు

    జమ్ముకశ్మీర్: రాజౌరిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం జమ్ముకశ్మీర్
    మణిపూర్‌లో 'నీట్ యూజీ 2023' పరీక్ష వాయిదా  మణిపూర్
    టెక్సాస్‌లో తుపాకీ గర్జన: 9 మంది మృతి, ఏడుగురికి గాయాలు  టెక్సాస్
    మణిపూర్‌లో 23,000మందిని రక్షించిన సైన్యం; చురచంద్‌పూర్‌లో పాక్షికంగా కర్ఫ్యూ సడలింపు  మణిపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025