Loading...
PM Modi-President Xi: ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్‌.. మోదీతో భేటీకి రంగం సిద్ధం?
ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్‌.. మోదీతో భేటీకి రంగం సిద్ధం?

PM Modi-President Xi: ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్‌.. మోదీతో భేటీకి రంగం సిద్ధం?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2026
01:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐదేళ్లుగా ఒడుదొడుకులతో కొనసాగుతున్న భారత్‌-చైనా సంబంధాల్లో కీలక మలుపు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో జరిగే బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ద్వైపాక్షికంగా సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ భేటీ జరిగితే.. 2020లో గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత ఇరువురు నేతలు ముఖాముఖిగా చర్చలు జరపడం ఇదే తొలిసారి అవుతుంది.

వివరాలు 

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ శనివారం భారత్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఆయన భారత గడ్డపై అడుగుపెట్టనున్నారు.

ఇటీవల కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో మోదీ, జిన్‌పింగ్‌ ఒకే వేదికపై కనిపించారు.

ఈ సందర్భంగా ఇద్దరూ పరస్పరం కరచాలనం చేసుకున్నప్పటికీ.. ప్రత్యేకంగా ద్వైపాక్షిక చర్చలు మాత్రం నిర్వహించలేదు.

ఇప్పుడు బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా సమావేశం జరిగితే.. భారత్‌-చైనా సంబంధాలపై దాని ప్రభావం గణనీయంగా ఉండే అవకాశం ఉంది.

వివరాలు 

సరిహద్దు వివాదం నుంచి వాణిజ్యం వరకు..

జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనకు ముందు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ చైనాలో పర్యటించి అక్కడి ఉన్నతస్థాయి అధికారులతో చర్చలు జరిపారు.

సరిహద్దు అంశాలపై డబ్ల్యూఎంసీసీ సమావేశం అనంతరం ఇరుదేశాల ప్రత్యేక ప్రతినిధులు కూడా సమావేశమయ్యారు.

ఈ నేపథ్యంలో మోదీ-జిన్‌పింగ్‌ భేటీ జరిగితే సరిహద్దు వివాదం, వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

అలాగే వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపైనా ఇరువురు నేతలు చర్చించే అవకాశముంది.

ADVERTISEMENT

వివరాలు 

అరుణాచల్‌ ప్రదేశ్‌పై చైనా వైఖరే మరో సవాల్

లడఖ్‌ ప్రాంతంలో గతంతో పోలిస్తే ఉద్రిక్తతలు తగ్గినప్పటికీ.. భారత్‌-చైనా సరిహద్దు వివాదానికి ఇప్పటికీ పూర్తిస్థాయి పరిష్కారం లభించలేదు.

ముఖ్యంగా అరుణాచల్‌ ప్రదేశ్‌పై చైనా చేస్తున్న వాదనలను భారత్‌ తీవ్రంగా ఖండిస్తోంది.

అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ భూభాగంలో భాగమని చైనా చెబుతుండగా.. భారత్‌ మాత్రం ఆ వాదనను పూర్తిగా తిరస్కరిస్తోంది.

ఇటీవల అప్పర్‌ సుబన్‌సిరి ప్రాంతంలో చైనా సైనికుల కదలికలకు సంబంధించిన నివేదికలు వెలువడటం కూడా ఆందోళనకు కారణమైంది.

ఈ పరిస్థితుల్లో మోదీ, జిన్‌పింగ్‌ భేటీ జరిగితే.. సరిహద్దులో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించడంపై భారత్‌ తన స్పష్టమైన వైఖరిని మరోసారి తెలియజేసే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

అరుణాచల్‌ ప్రదేశ్‌పై చైనా వైఖరే మరో సవాల్

అమెరికా విధిస్తున్న సుంకాలు, పశ్చిమాసియాలో నెలకొన్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో భారత్‌, చైనా మధ్య ఆర్థిక, వాణిజ్య, దౌత్య సంబంధాలను భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపైనా చర్చ జరిగే అవకాశముంది.

మొత్తంగా బ్రిక్స్‌ వేదికగా మోదీ-జిన్‌పింగ్‌ భేటీ జరిగితే.. సరిహద్దు సమస్యతో పాటు ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు అది ఎంతవరకు దోహదపడుతుందన్నది ఆసక్తికరంగా మారనుంది.

ADVERTISEMENT