Page Loader
Bomb Threat: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పాఠశాలకు బాంబు బెదిరింపులు 
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పాఠశాలకు బాంబు బెదిరింపులు

Bomb Threat: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పాఠశాలకు బాంబు బెదిరింపులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2025
03:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబై నగర ఆర్థిక రాజధానిలోని ఒక పాఠశాలలో బాంబు బెదిరింపు మెయిల్ (Bomb Threat)కలకలం సృష్టించింది. జోగేశ్వరి-ఓషివారా ప్రాంతంలో ఉన్న పాఠశాల ఆవరణలో బాంబు పెట్టామనే మెసేజ్ ఇవాళ అందింది. ఈ బెదిరింపు మెయిల్‌ వచ్చిన వెంటనే, పాఠశాల యాజమాన్యం అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని, బాంబ్ స్క్వాడ్ (Bomb Squad) డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆ పాఠశాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అయితే, ఈ తనిఖీల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఈ బెదిరింపు మెయిల్‌ను పంపిన వ్యక్తి అఫ్జల్ గ్యాంగ్ పేరును ప్రస్తావించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ముంబైలో పాఠశాలకు బాంబు బెదిరింపులు