NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Venkaiah naidu: తెలుగు భాషతోనే నా ఎదుగుదల : వెంకయ్యనాయుడు
    తదుపరి వార్తా కథనం
    Venkaiah naidu: తెలుగు భాషతోనే నా ఎదుగుదల : వెంకయ్యనాయుడు
    తెలుగు భాషతోనే నా ఎదుగుదల : వెంకయ్యనాయుడు

    Venkaiah naidu: తెలుగు భాషతోనే నా ఎదుగుదల : వెంకయ్యనాయుడు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 05, 2025
    01:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు భాషను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు.

    మాతృభాషను ప్రేమించకపోతే, మరెవరు ప్రేమిస్తారని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ మాతృభాషలో మాట్లాడడాన్ని అలవాటుగా మార్చుకోవాలని ఆయన సూచించారు.

    హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ తెలుగు సమాఖ్య మహాసభల్లో ఆయన మాట్లాడారు. తన ఎదుగుదలకు తెలుగు భాషే కారణమని చెప్పారు.

    దేశంలోని పెద్ద పదవుల్లో ఉన్నవారంతా మాతృభాషలోనే చదివినవారని గుర్తుచేశారు.

    తెలుగు భాష అనునది గొప్ప భాష అని, దీని అలంకారాలు, సామెతలు ఎంతో విశిష్టతను కలిగి ఉన్నాయన్నారు. 2012లో తెలుగు ప్రపంచంలో రెండో ఉత్తమ లిపిగా నిలిచిందన్నారు.

    Details

    మాతృభాష శ్వాసలాంటిది

    తెలుగు భాషలో మన సంస్కృతి ఇమిడి ఉందని, ఎటువంటి భాషా వ్యామోహానికీ తలొగ్గకుండా, తెలుగులో విద్యను అందించడం ముఖ్యమని ఆయన తెలిపారు.

    వెంకయ్యనాయుడు తన ప్రసంగంలో మాతృభాషను ప్రాధాన్యంగా పేర్కొన్నారు. మాతృభాష అనేది మన జీవితానికి శ్వాస వంటిదన్నారు.

    1980లలో ఎన్టీఆర్‌ అమెరికాలో తెలుగు మహాసభల ఆవిర్భావం కోసం పునాది వేశారన్నారు.

    అంతకుముందు తాను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నానని చెప్పారు. విదేశాల్లో తెలుగువారిని ఒకే వేదికపైకి తీసుకురావడం ప్రశంసనీయమైన విషయమన్నారు.

    తెలుగు భాషను మరింత బలోపేతం చేయాలంటే ప్రాథమిక విద్యను తెలుగులోనే అందించాలని ఆయన పిలుపునిచ్చారు.

    ఇంగ్లీష్‌ భాషపై వ్యామోహంతో కొన్ని భాషలు అంతరించిపోతున్నాయని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇండియా

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    ఇండియా

    EPFO: అధిక పింఛనుకు గడువు పెంపు.. పెండింగ్‌లో ఉన్న 3.1 లక్షల దరఖాస్తులకు ఈపీఎఫ్‌ఓ మరో అవకాశం ఈపీఎఫ్ఓ
    Tashi Namgyal: కార్గిల్ యుద్ధంలో పాక్ కుట్రను భగ్నం చేసిన ఆ గొర్రెల వ్యాపారి ఇక లేరు జమ్ముకశ్మీర్
    Alcohol prices: ఏపీలో మద్యం ప్రియులు పండుగలాంటి వార్త.. భారీగా తగ్గనున్న ధరలు! ఆంధ్రప్రదేశ్
    Tamil Nadu: ఆలయ హుండీలో పడిన ఐఫోన్.. దేవుడి సొత్తుగా ప్రకటించిన ఆలయాధికారులు  తమిళనాడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025