NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పాడేరు-లంబసింగి రహదారికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ 
    తదుపరి వార్తా కథనం
    పాడేరు-లంబసింగి రహదారికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ 
    పాడేరు-లంబసింగి రహదారికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

    పాడేరు-లంబసింగి రహదారికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ 

    వ్రాసిన వారు Stalin
    Jun 14, 2023
    03:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో నూతన రోడ్ల నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) పచ్చజెండా ఉంది. అందులో భాగంగా పర్యాటక ప్రాంతమైన పాడేరు-లంబసింగి రోడ్డు నిర్మాణానికి అంగీకారం తెలిపింది.

    ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే పాడేరు, లంబసింగి ప్రాంతాలు పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతాయని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

    దాదాపు 48 కిలోమీటర్ల మేర పక్కా రోడ్డును నిర్మించేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది.

    ఆంధ్ర కశ్మీర్‌గా పిలుచుకునే లంబసింగిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

    ఈ రోడ్డు నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ రూ.206కోట్లతో టెండర్ల ప్రక్రియను చేపడుతోంది. 2024 నాటికి ఈ రెండు వరుసల రోడ్డును పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది.

    పాడేరు

    మరికొన్ని ప్రాజెక్టులకు ఆమోద ముద్ర

    పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక ఆర్ఓబీని నిర్మించేందుకు కూడా కేంద్రం అమోదం తెలిపింది. సీతారామపురం-దత్తలూరు రహదారి వెంబడి ఈ ఆర్ఓబీని నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ.545 కోట్లు కేటాయించింది.

    ఇదిలా అంటే, పొట్టి శ్రీరాములు జిల్లాలోని సీతారామపురం-దత్తలూరు వరకు 36.40 కి.మీ రోడ్డును రెండు వరుసల రహదారిగా నిర్మించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

    దీని కోసం రూ.267 కోట్లు కేటాయించింది. దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.

    అలాగే మదనపల్లె సమీపంలో ఓ ఆర్‌డబ్ల్యూబీని నిర్మించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదం తెలిపింది. రైల్వే క్రాసింగ్ వద్ద దీన్ని నిర్మించనుంది. దీనికి రూ.72.50 కోట్లను కేటాయించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాడేరు
    ఆంధ్రప్రదేశ్
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    పాడేరు

    APSRTC: పాడేరు, అరకులోయ, బొర్రా గుహలకు 'ఏపీఎస్ఆర్టీసీ' ప్రత్యేక టూర్ ప్యాకేజీ  ఏపీఎస్ఆర్టీసీ

    ఆంధ్రప్రదేశ్

    తెలంగాణకు వర్ష సూచన; ఆంధ్రప్రదేశ్‌‌లో పిడుగులతో కూడిన వానలు  తెలంగాణ
    వైఎస్‌ అవినాష్‌రెడ్డికి భారీ ఊరట; ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు  హైకోర్టు
    ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రిచెస్ట్ ఉమెన్! ఎవరీ మహిమా దాట్ల? తెలంగాణ
    2025 నాటికి పోలవరాన్ని పూర్తి చేయండి; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం గడువు  పోలవరం

    తాజా వార్తలు

    రెజ్లర్లు అనుచిత వ్యాఖ్యలు చేయలేదు; కోర్టుకు తెలిపిన దిల్లీ పోలీసులు దిల్లీ
    రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు: 8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్  ఐఎండీ
    మైనింగ్ స్కామ్‌ కేసులో బిహార్, జార్ఖండ్, బెంగాల్‌లోని 27చోట్ల ఈడీ సోదాలు  బిహార్
    'జల్ జీవన్ మిషన్' పూర్తయితే భారత్‌లో 4లక్షల మరణాలను నివారించవచ్చు: డబ్ల్యూహెచ్ఓ  ప్రపంచ ఆరోగ్య సంస్థ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025