NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amit Shah: 2026 మార్చి నాటికి నక్సలిజం అంతం.. అమిత్‌ షా 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Amit Shah: 2026 మార్చి నాటికి నక్సలిజం అంతం.. అమిత్‌ షా 

    Amit Shah: 2026 మార్చి నాటికి నక్సలిజం అంతం.. అమిత్‌ షా 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 09, 2025
    05:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు హతమైన సంగతి తెలిసిందే. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

    ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పందిస్తూ, దేశాన్ని నక్సల్స్‌ రహితంగా మార్చే దిశగా భద్రతా దళాలు భారీ విజయం సాధించాయని తెలిపారు.

    2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని 'ఎక్స్‌' వేదికగా పునరుద్ఘాటించారు.

    Details

    నక్సలిజం అంతం దిశగా మరో అడుగు 

    ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు చేపట్టిన ఈ భారీ ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులను మట్టుబెట్టారు. అదేవిధంగా పెద్దఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

    మానవత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నక్సలిజాన్ని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంగా ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. వీరి త్యాగాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.

    2026 మార్చి 31 నాటికి దేశాన్ని నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తి చేసే సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తున్నాను.

    ఇక నుంచి ఏ పౌరుడూ ఈ సమస్య కారణంగా ప్రాణాలు కోల్పోకూడదని అమిత్‌ షా స్పష్టం చేశారు.

    Details

     భద్రతా దళాలకు సీఎం విష్ణుదేవ్‌ సాయ్‌ ప్రశంస 

    ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ సాయ్‌ స్పందిస్తూ, భద్రతా బలగాల ధైర్యసాహసాలను కొనియాడారు.

    తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నక్సల్స్‌ వ్యతిరేకంగా బలంగా పోరాడుతున్నట్లు మీడియాతో వెల్లడించారు.

    తాజా ఎదురుకాల్పుల ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని రాయ్‌పుర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

    ఛత్తీస్‌గఢ్‌ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద ఎన్‌కౌంటర్‌గా చెబుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమిత్ షా
    ఇండియా

    తాజా

    AP High Court: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్..  స్టే పిటిషన్లను కొట్టేసిన న్యాయస్థానం హైకోర్టు
    Australia: భారత సంతతి వ్యక్తిని దారుణంగా కొట్టిన ఆస్ట్రేలియా పోలీసులు.. జార్జి ఫ్లాయిడ్‌ ఉదంతమంటూ ఆరోపణ ఆస్ట్రేలియా
    Virat Kohli: ఐపీఎల్‌కు కోహ్లీ గుడ్‌బై చెప్పనున్నాడా..? అరుణ్ ధుమాల్ వ్యాఖ్యలతో ఊహాగానాలు! విరాట్ కోహ్లీ
    Trade deal: భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం: అమెరికా వాణిజ్య కార్యదర్శి అమెరికా

    అమిత్ షా

    Telangana: తెలంగాణలోని వర్షాలు, వరద పరిస్థితులపై  ప్రధాని, అమిత్‌షా ఆరా  తెలంగాణ
    Tripura: శాంతి ఒప్పందంపై సంతకాలు.. హోంమంత్రి సమక్షంలో సంతకాలు చేసిన మిలిటెంట్ గ్రూపులు  త్రిపుర
    JammuKashmir Elections: బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన అమిత్ షా  జమ్ముకశ్మీర్
    Amit Shah: సైబర్‌ భద్రత లేకుండా దేశ ప్రగతి అసాధ్యం: అమిత్‌ షా భారతదేశం

    ఇండియా

    Singer Abhijeet: మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సింగర్ అభిజిత్‌కు లీగల్ నోటీసులు మహాత్మా గాంధీ
    Venkaiah naidu: తెలుగు భాషతోనే నా ఎదుగుదల : వెంకయ్యనాయుడు భారతదేశం
    Nagpur rescue centre: మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ కలకలం.. మూడు పులులు, చిరుత మృతి మహారాష్ట్ర
    Prayagraj: 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా.. వక్ఫ్ భూమిపై కొనసాగుతున్న వివాదం ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025