Page Loader
Parag Jain: భారత గూఢచార విభాగానికి కొత్త అధిపతి.. పరాగ్ జైన్ అరుదైన గౌరవం
భారత గూఢచార విభాగానికి కొత్త అధిపతి.. పరాగ్ జైన్ అరుదైన గౌరవం

Parag Jain: భారత గూఢచార విభాగానికి కొత్త అధిపతి.. పరాగ్ జైన్ అరుదైన గౌరవం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 28, 2025
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత విదేశీ గూఢచార సంస్థ రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (RAW) కొత్త చీఫ్‌గా పంజాబ్‌ కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి పరాగ్‌ జైన్‌ నియమితులయ్యారు. 1989 బ్యాచ్‌కు చెందిన జైన్ జూలై 1వ తేదీ నుంచి ఈ పదవిని అధిష్ఠించనున్నారు. ఆయన రెండు సంవత్సరాల కాలానికి ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు. ప్రస్తుత రా చీఫ్‌ రవి సిన్హా పదవీకాలం జూన్ 30తో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త అధిపతిగా పరాగ్‌ జైన్‌ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు కేంద్ర నియామకాల కేబినెట్‌ కమిటీ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. 'సూపర్ డిటెక్టివ్'గా పేరుగాంచిన పరాగ్‌ జైన్, గూఢచార విభాగంలో అనేక కీలక ఆపరేషన్లకు నాయకత్వం వహించారు.

Details

ఆపరేషన్ సింధూర్ లో ప్రధాన పాత్ర

ఇటీవల భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్లో ఆయన ప్రధాన పాత్ర పోషించినట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌లో పీవోకే (పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్)తోపాటు పాకిస్థాన్‌లో ఉన్న పలు ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిట్టమధ్యాహ్నం పేల్చివేసినప్పటికీ, దీని వెనక ఉన్న గూఢచార ప్రణాళికలు సంవత్సరాలుగా సిద్ధం చేసినవేనని సమాచారం. జైన్‌ 2021లో పంజాబ్ డీజీపీ ర్యాంక్‌ను అందుకున్నారు. అనంతరం డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లోకి వచ్చారు. ఆయనకు విదేశీ నిఘా వ్యవస్థపై సుదీర్ఘ అనుభవంతో పాటు మైదాన స్థాయిలో అనేక కీలక సమాచారం. సేకరణ చర్యల్లోనూ ప్రావీణ్యం ఉంది. ఇప్పుడు RAW చీఫ్‌గా ఆయన నియామకం భారత గూఢచార వ్యవస్థకు మరింత బలోపేతం చేయనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.