LOADING...
Ponnam Prabhakar: హైదరాబాద్‌లో కాలుష్యం నివారణ కోసం కొత్త ప్రణాళికలు : మంత్రి పొన్నం
హైదరాబాద్‌లో కాలుష్యం నివారణ కోసం కొత్త ప్రణాళికలు : మంత్రి పొన్నం

Ponnam Prabhakar: హైదరాబాద్‌లో కాలుష్యం నివారణ కోసం కొత్త ప్రణాళికలు : మంత్రి పొన్నం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 22, 2025
05:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని కాలుష్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్‌లో ఇలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు చేపట్టినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ శాఖలో మధ్యవర్తులను పూర్తిగా తొలగిస్తూ, ఏఐ (Artificial Intelligence) వినియోగాన్ని మరింత పెంపొందించడానికి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాలపై రూ.577 కోట్ల పన్ను మినహాయింపుని ప్రకటించినప్పటి నుంచి, వాటి విక్రయాలు 0.03 శాతం నుంచి 1.30 శాతానికి పెరిగాయని మంత్రి చెప్పారు.

Details

1.70 కోట్లకు చేరిన వాహనాల సంఖ్య

రాష్ట్రంలో వాహనాల మొత్తం సంఖ్య 1.70 కోట్లకు చేరింది. వాహన సారథి పోర్టల్‌ను పూర్తిగా అందుబాటులోకి తెచ్చి, ప్రజలకు షోరూమ్‌లోనే వాహనాలను రిజిస్టర్ చేయడానికి సౌకర్యాన్ని ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు. ప్రజల సహకారమే ఉంటే మాత్రమే ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యాన్ని తగ్గించడం సాధ్యమని మంత్రి అన్నారు