NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డులు గ్రీన్ సిగ్నల్.. అర్హతలు ఇవే..!
    తదుపరి వార్తా కథనం
    New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డులు గ్రీన్ సిగ్నల్.. అర్హతలు ఇవే..!
    ఏపీలో కొత్త రేషన్ కార్డులు గ్రీన్ సిగ్నల్.. అర్హతలు ఇవే..!

    New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డులు గ్రీన్ సిగ్నల్.. అర్హతలు ఇవే..!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 14, 2024
    11:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రణాళికలను రచిస్తోంది. గతంలో అమలు చేసిన చంద్రన్న కానుకలను తిరిగి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    రేషన్ కార్డుల జారీతో పాటు మార్గదర్శకాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది.

    పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించుకుంది.

    త్వరలోనే అధికారికంగా దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

    గత రేషన్ కార్డులపై అప్పటి సీఎం జగన్, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోలను ముద్రించారు.

    Details

    కొత్త కార్డులివ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం

    ఇప్పుడు పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులివ్వాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

    ఏపీలో మొత్తం 1.48 రేషన్ కార్డులు ఉన్నా, వాటిలో 90 లక్షల రేషన్ కార్డులు మాత్రమే బీపీఎల్ కింద ఉన్నట్లు గుర్తించారు.

    మిగిలిన 58 లక్షలకు పైగా కార్డులపై సబ్సిడీల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.

    వైసీపీ ప్రభుత్వం 1.47 కోట్ల రేషన్ కార్డులు ఉండగా, గడిచిన ఐదేళ్లలో 1.48 కోట్లు పెరిగాయి.

    ఇప్పటికే కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులు 78వేలకు చేరాయి.

    వీటిన్నింటిని ఆ ప్రభుత్వం పక్కన పెట్టేసింది.

    Details

    రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం 3.36 లక్షల దరఖాస్తులు

    ఇక మార్పులు, చేర్పుల కోసం మొత్తం 3.36 లక్షల దరఖాస్తులు ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉండడం గమనార్హం.

    ఇక ప్రభుత్వం గుర్తించిన 90 లక్షల కార్డుల్లో 1,36,420 కుటుంబాలు ఆరు నెలలుగా పైగా రేషన్ సరుకులు తీసుకోవడం లేదు.

    ఒకవేళ వాటిని తొలగిస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.90 కోట్ల వరకు ఆదా కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 90 శాతం కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయి.

    మళ్లీ తెల్లకార్డులు, గులాబీ కార్డులను అమల్లోకి తెచ్చిన దాదాపు సగం భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ప్రభుత్వం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    ఆంధ్రప్రదేశ్

    AP-Amith Sha-Election Campaign: గూండాగిరి, అవినీతిని అంతం చేయడానికే పొత్తు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ
    Road accident-Truck- Cash Ceased Andhra Pradesh: ఏపీలో వాహనం బోల్తా...అందులోంచి రూ.7కోట్లు స్వాధీనం రోడ్డు ప్రమాదం
    Andhrapradesh : వ్యాను ఢీ కొట్టిన లారీ.. బయటపడ్డ 7 కోట్ల నగదు  భారతదేశం
    Election cmapiagn -Completed: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం..144 సెక్షన్​ అమలు తెలంగాణ

    ప్రభుత్వం

    తెలంగాణలో విద్యాసంస్థలకు శుక్రవారం కూడా సెలవే.. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిర్ణయం తెలంగాణ
    పోలీసులకు ఏపీ సర్కారు షాక్.. వివిధ విభాగాలకు అలవెన్సుల కోత విధిస్తూ ఉత్తర్వులు జారీ ఆంధ్రప్రదేశ్
    కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ప్రధాన చర్చ వీటిపైనే!  తెలంగాణ
    Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 3 రోజులే.. బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయం తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025