Page Loader
AP : ఏపీలో కొత్త నిబంధన.. ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీకి అర్హులే
ఏపీలో కొత్త నిబంధన.. ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీకి అర్హులే

AP : ఏపీలో కొత్త నిబంధన.. ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీకి అర్హులే

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2024
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలను మారుస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై పిల్లల సంఖ్య ఎంత ఉన్నా, పట్టణ స్థాయి ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హులుగా ప్రకటించింది. జనాభా వృద్ధి రేటు పెంపుదలతో సంబంధించి, మున్సిపల్ శాసనాల సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు 2024లో అమలులోకి రానుంది. ఈ బిల్లును మంత్రి నారాయణ సభలో ప్రతిపాదించారు. ఆయన మాటల్లో జనాభా వృద్ధి రేటు పెంపుదలలో భాగంగానే చట్టంలో మార్పులు తీసుకువచ్చామని స్పష్టం చేశారు.

Details

  చట్ట సవరణలో నూతన సవరణలు 

శాసనమండలి ఆమోదం పొందిన తరువాత, జీవో జారీ చేయగానే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని మంత్రి తెలిపారు. గతంలో ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్న వారు పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులేకుండా ఉండేవారు. తాజాగా ప్రస్తుతం తీసుకున్న ఈ చట్ట సవరణతో ఈ నిబంధనలో మార్పులు చేశారు.