NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / NIRD: గ్రామీణాభివృద్ధి శిక్షణకు జీవనాడిగా ఎన్‌ఐఆర్‌డీ గుర్తింపు.. కేంద్రం గ్రాంటు నిలిపివేతతో మూసివేత ప్రమాదం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    NIRD: గ్రామీణాభివృద్ధి శిక్షణకు జీవనాడిగా ఎన్‌ఐఆర్‌డీ గుర్తింపు.. కేంద్రం గ్రాంటు నిలిపివేతతో మూసివేత ప్రమాదం
    గ్రామీణాభివృద్ధి శిక్షణకు జీవనాడిగా ఎన్‌ఐఆర్‌డీ గుర్తింపు

    NIRD: గ్రామీణాభివృద్ధి శిక్షణకు జీవనాడిగా ఎన్‌ఐఆర్‌డీ గుర్తింపు.. కేంద్రం గ్రాంటు నిలిపివేతతో మూసివేత ప్రమాదం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 24, 2025
    08:10 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జాతీయ పోలీస్ అకాడమీ, పరిపాలన అకాడమీ లాంటి ప్రముఖ సంస్థల మాదిరిగా, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ రంగాల్లో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అగ్రగామి సంస్థగా జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ) ఉంది.

    ఈ సంస్థ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు మౌలిక కేంద్రంగా పనిచేసింది.

    ముఖ్యంగా ఉపాధి హామీ పథకంతో పాటు అనేక ప్రభుత్వ పథకాలకు ఇదే ఆవిర్భావ స్థలమైంది.

    అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ కేంద్రంగా గుర్తింపు పొందిన ఈ సంస్థ, డిప్లొమా, పీజీ, పీహెచ్‌డీ కోర్సులను నిర్వహిస్తూ వస్తోంది.

    అయితే ప్రస్తుతం ఈ సంస్థ మూసివేత ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇస్తున్న రూ.78 కోట్ల గ్రాంటును పూర్తిగా నిలిపివేసింది. ఇది సంస్థను గణనీయంగా కుదించే చర్యగా మారింది.

    వివరాలు 

     2014లో పంచాయతీరాజ్ శాఖ విలీనం 

    1953లో దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆశయాలకు అనుగుణంగా 166 ఎకరాల విస్తీర్ణంలో రాజేంద్రనగర్‌లో జాతీయ సామాజికాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐసీడీ)గా ఈ సంస్థ ఏర్పడింది.

    తర్వాత దీనిని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థగా మార్చగా, 2014లో పంచాయతీరాజ్ శాఖను ఇందులో విలీనం చేశారు.

    ప్రస్తుతం 220 మంది శాశ్వత ఉద్యోగులు, 120 మంది కాంట్రాక్ట్ సిబ్బంది, 300 మంది పెన్షనర్లు ఈ సంస్థలో ఉన్నారు.

    దీనికి 23 భవన సముదాయాలు, 66 ఎకరాల్లో గ్రామీణ సాంకేతిక పార్క్, అలాగే ఒక ప్రైవేట్ పాఠశాలకు ఉచితంగా ఇవ్వబడిన భవన సముదాయం కూడా ఉంది.

    వివరాలు 

    కాంట్రాక్ట్ సిబ్బందిపై వేటు కుదురుతుందా? 

    కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శకులు అంటున్నారు.

    నిధుల నిలిపివేత దానికి కొనసాగింపే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శిక్షణల ద్వారా ఆదాయం పొందాలనే సూచన ఉన్నా,అది ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాకపోవచ్చు.

    సిబ్బందికి జీతభత్యాలు చెల్లించడంలో సంస్థ ఇబ్బంది పడే స్థితికి వచ్చింది.

    ఈ నేపథ్యంలో 120 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ప్రైవేట్ పాఠశాల నుండి అద్దె వసూలు చేయాలనే యోచన కూడా వెలువడింది.

    తాజాగా పార్లమెంటరీ స్థాయి సంఘం ఈ సంస్థను సందర్శించి పరిస్థితిని పరిశీలించింది.

    సంస్థను మూసివేస్తే తీవ్ర ప్రతికూలతలు ఎదురవుతాయని హెచ్చరించి, దాన్ని నిలుపుదల చేయడానికి కేంద్రానికి సిఫార్సు చేస్తామని హామీ ఇచ్చింది.

    వివరాలు 

    ముందస్తు సమాచారం లేకుండానే నిధుల నిలిపివేత 

    గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ రంగాలకు ఇది ప్రాణవాయువు లాంటిదని భావిస్తూ, ఈ సంస్థకు మళ్లీ గ్రాంటులు విడుదల చేయాలని, మూసివేత చర్యలను వెనక్కి తీసుకోవాలని అకడమిక్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.

    ఈ సంస్థ దేశవ్యాప్తంగా ప్రసిద్ధ నిపుణులు,ప్రొఫెసర్లతో గ్రామీణ పాలన,పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామీణ అభివృద్ధి,ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై అత్యుత్తమ శిక్షణ అందిస్తోంది.

    డిమాండ్ పెరగడంతో ఈ సంస్థ దిల్లీ, గువాహటి (అస్సాం), వైశాలి (బిహార్) వంటి ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

    పీహెచ్‌డీ లాంటి కోర్సులు నిర్వహించేందుకు గ్రామీణాభివృద్ధిలో అనుభవజ్ఞుడైన అధికారులు డైరెక్టర్ జనరల్‌గా నియమించబడ్డారు.

    పోలీసు, పరిపాలన అకాడమీలకు కేంద్రం నేరుగా బడ్జెట్‌ను కేటాయించగా, ఎన్‌ఐఆర్‌డీకీ కూడా ఇదే స్థాయిలో నిధులు అందజేస్తూ ఉచిత శిక్షణలు అందించడానికి వీలు కల్పించేది.

    వివరాలు 

    సంస్థ స్వయం ఆదాయ వనరులు పెంచుకోవాలి: కేంద్రం 

    అయితే తాజా కేంద్ర బడ్జెట్‌లో ఈ సంస్థకు నిధులు కేటాయించలేదు. ఇకపై సంస్థ స్వయం ఆదాయ వనరులు పెంచుకోవాలని సూచించింది.

    ఇది తీవ్ర ఆందోళనకు దారి తీసింది, ఎందుకంటే ఈ మేరకు సంస్థ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా సంబంధిత శాఖలకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒక్కసారిగా నిధుల నిలిపివేత నిర్ణయం తీసుకోవడం విశేష ఆశ్చర్యానికి గురిచేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా
    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం
    Israel-Hamas: మళ్లీ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 66 మంది మృతి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

    తెలంగాణ

    Telangana: బోధనలో నాణ్యత పెంచే లక్ష్యంతో.. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులకు ఇంటర్‌ విద్యాశాఖ శ్రీకారం భారతదేశం
    Pre primary: సర్కారు బడుల్లోనూ ప్రీ ప్రైమరీ.. ప్రభుత్వ నిర్ణయం భారతదేశం
    Liquor shops closed: రేపు మద్యం దుకాణాలు బంద్.. కారణమిదే? భారతదేశం
    Telangana: తెలంగాణలో మళ్లీ భూకంపం భయం..? రామగుండం పరిసరాల్లో హెచ్చరికలు! భూకంపం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025