NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఐక్యరాజ్యసమితి సమావేశంలో నిత్యానంద 'కైలాస' దేశ మహిళా ప్రతినిధులు
    ఐక్యరాజ్యసమితి సమావేశంలో నిత్యానంద 'కైలాస' దేశ మహిళా ప్రతినిధులు
    భారతదేశం

    ఐక్యరాజ్యసమితి సమావేశంలో నిత్యానంద 'కైలాస' దేశ మహిళా ప్రతినిధులు

    వ్రాసిన వారు Naveen Stalin
    February 28, 2023 | 06:27 pm 1 నిమి చదవండి
    ఐక్యరాజ్యసమితి సమావేశంలో నిత్యానంద 'కైలాస' దేశ మహిళా ప్రతినిధులు
    ఐక్యరాజ్యసమితి సమావేశంలో నిత్యానంద 'కైలాస' దేశ మహిళా ప్రతినిధులు

    వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, స్వయం ప్రకటిత దైవం, కైలాస దేశ వ్యవస్థాపకుడు, స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. ఐక్యరాజ్యసమితి నిర్వహించిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల జనరల్ అసెంబ్లీలో కైలాస దేశ ప్రతినిధులు హాజరయ్యారు.ఈ విషయాన్ని స్వయంగా నిత్యానంద తెలియజేశారు. జనీవాలో జరిగిన సమావేశంలో తమ ప్రతినిధులు హాజరైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ మహిళా ప్రతినిధి భారత్‌పై విమర్శలు చేశారు. స్వామి నిత్యానందను ఆ దేశం వేధిస్తోందని చెప్పారు. నిత్యానందకు రక్షణ కల్పించాలని కైలాస దేశ మహిళా ప్రతినిధి విజయప్రియ కోరారు.

    2019లో దేశం నుంచి పారిపోయిన నిద్యానంద

    హిందువుల కోసం స్వామి నిద్యానంద తొలి సార్వభౌమ దేశం కైలాసాన్ని ఏర్పాటు చేసినట్లు విజయప్రియ పేర్కొన్నారు. హిందూ నాగరికతను స్వామి నిద్యానంద కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఆది శైవులు అనే వ్యవసాయ తెగలకు ఆయన పునర్జీవం పోస్తున్నారని వివరించారు. నిత్యానందపై భారత్‌లో పలు కేసులు నమోదయ్యాయి. అత్యాచారం, అపహరణ వంటి కేసుల్లో ఆయన ఆరోపణల ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయన 2019లో దేశం నుంచి పారిపోయారు. అనంతరం 2020లో తాను ఒక సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు, దాని పేరు 'కైలాసం'గా ప్రకటించారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    స్విట్జర్లాండ్
    భారతదేశం

    స్విట్జర్లాండ్

    మాజీ ఉద్యోగి వేల మంది సిబ్బంది డేటాను దొంగిలించినట్లు ఆరోపించిన Credit Suisse బ్యాంక్
    కేటీఆర్: తెలంగాణలో గ్లోబల్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' పెట్టుబడులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుకండి: కేటీఆర్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    క్రెడిట్ సూయిస్‌ను కొనుగోలు చేయనున్న UBS బ్యాంక్ బ్యాంక్

    భారతదేశం

    భారతదేశంలో 2023 హ్యుందాయ్ ALCAZAR బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి ఆటో మొబైల్
    దిల్లీలో జరిగే జీ20 సమావేశానికి చైనా హాజరు చైనా
    డిఫెండర్ 130 SUVని రూ. 1.3 కోట్లకు భారతదేశంలో లాంచ్ చేయనున్న ల్యాండ్ రోవర్ ఆటో మొబైల్
    అధిక పెన్షన్ దరఖాస్తు గడువును పొడిగించిన EPFO పెన్షన్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023