Page Loader
Maharastra: మహారాష్ట్రలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి కొత్త నిబంధన.. పార్కింగ్ ప్లేస్ లేకపోతే కార్లు అమ్మొద్దు 
మహారాష్ట్రలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి కొత్త నిబంధన

Maharastra: మహారాష్ట్రలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి కొత్త నిబంధన.. పార్కింగ్ ప్లేస్ లేకపోతే కార్లు అమ్మొద్దు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2025
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలో పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించడానికి సర్కార్ కొత్త ప్రతిపాదనను ప్రవేశపెట్టింది. కొత్త రూల్ ప్రకారం, పార్కింగ్ స్థలం ఉన్నవారికి మాత్రమే కార్లు విక్రయించమని రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ తెలిపారు. ఇకపై, కార్లు కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు పార్కింగ్ స్థలానికి సంబంధించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధన త్వరలో అమలులోకి రానుందని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలోని పలు నగరాల్లో ఉన్న అపార్ట్‌మెంట్లలో నివసించే వారికి తగిన పార్కింగ్ స్థలం లభించకపోవడం వలన వారు తమ కార్లను రోడ్లపై పార్క్ చేస్తున్నారు. దీనితో జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడతాయి.

వివరాలు 

అంబులెన్స్‌లు, అగ్నిమాపక యంత్రాల వంటి అత్యవసర సేవలకు అవరోధం

మంత్రి ప్రతాప్ సర్నాయక్ ప్రస్తావించినట్లుగా, ఈ పరిస్థితి వల్ల ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపై వేచి ఉండాల్సి వస్తుంది. మరింతగా, అంబులెన్స్‌లు, అగ్నిమాపక యంత్రాల వంటి అత్యవసర సేవలకు అవరోధం ఏర్పడుతుంది. అందువల్ల, ఈ సమస్యలను నివారించడానికి, కార్లు కొనుగోలు చేసేటప్పుడు పార్కింగ్‌ పత్రాలు సమర్పించాలన్న కొత్త రూల్‌ను అమలు చేయాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి విమర్శలు రావచ్చు అని మంత్రి తెలిపారు. మధ్యతరగతి కుటుంబాలకు కార్లు కొనుగోలు చేయకూడదని వారు చెప్పడం లేదని, కానీ వారి కోసం తగిన పార్కింగ్ స్థలాలు ఏర్పడాలని ఆయన అభిప్రాయపడ్డారు.

వివరాలు 

ముంబై మెట్రో పాలిటన్ రీజియన్‌లో కేబుల్ టాక్సీ వ్యవస్థ

మహారాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఈ నిర్ణయాలను తీసుకుంటున్నట్లు మంత్రి సర్నాయక్ చెప్పారు. అలాగే, ప్రజలు ప్రైవేటు వాహనాలపై ఆధారపడకుండా ఉండేందుకు, మెట్రో రైలు, ఇతర ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపర్చడానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి, ముంబై మెట్రో పాలిటన్ రీజియన్‌లో కేబుల్ టాక్సీ వ్యవస్థను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ కొత్త నిబంధనలను త్వరలో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, డిప్యూటీ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో చర్చలు జరుపుతున్నారని మంత్రి ప్రతాప్ సర్నాయక్ చెప్పారు.