NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Maharastra: మహారాష్ట్రలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి కొత్త నిబంధన.. పార్కింగ్ ప్లేస్ లేకపోతే కార్లు అమ్మొద్దు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Maharastra: మహారాష్ట్రలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి కొత్త నిబంధన.. పార్కింగ్ ప్లేస్ లేకపోతే కార్లు అమ్మొద్దు 
    మహారాష్ట్రలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి కొత్త నిబంధన

    Maharastra: మహారాష్ట్రలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి కొత్త నిబంధన.. పార్కింగ్ ప్లేస్ లేకపోతే కార్లు అమ్మొద్దు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 15, 2025
    11:07 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలో పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించడానికి సర్కార్ కొత్త ప్రతిపాదనను ప్రవేశపెట్టింది.

    కొత్త రూల్ ప్రకారం, పార్కింగ్ స్థలం ఉన్నవారికి మాత్రమే కార్లు విక్రయించమని రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ తెలిపారు.

    ఇకపై, కార్లు కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు పార్కింగ్ స్థలానికి సంబంధించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

    ఈ కొత్త నిబంధన త్వరలో అమలులోకి రానుందని ఆయన పేర్కొన్నారు.

    మహారాష్ట్రలోని పలు నగరాల్లో ఉన్న అపార్ట్‌మెంట్లలో నివసించే వారికి తగిన పార్కింగ్ స్థలం లభించకపోవడం వలన వారు తమ కార్లను రోడ్లపై పార్క్ చేస్తున్నారు.

    దీనితో జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడతాయి.

    వివరాలు 

    అంబులెన్స్‌లు, అగ్నిమాపక యంత్రాల వంటి అత్యవసర సేవలకు అవరోధం

    మంత్రి ప్రతాప్ సర్నాయక్ ప్రస్తావించినట్లుగా, ఈ పరిస్థితి వల్ల ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపై వేచి ఉండాల్సి వస్తుంది. మరింతగా, అంబులెన్స్‌లు, అగ్నిమాపక యంత్రాల వంటి అత్యవసర సేవలకు అవరోధం ఏర్పడుతుంది. అందువల్ల, ఈ సమస్యలను నివారించడానికి, కార్లు కొనుగోలు చేసేటప్పుడు పార్కింగ్‌ పత్రాలు సమర్పించాలన్న కొత్త రూల్‌ను అమలు చేయాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

    ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి విమర్శలు రావచ్చు అని మంత్రి తెలిపారు.

    మధ్యతరగతి కుటుంబాలకు కార్లు కొనుగోలు చేయకూడదని వారు చెప్పడం లేదని, కానీ వారి కోసం తగిన పార్కింగ్ స్థలాలు ఏర్పడాలని ఆయన అభిప్రాయపడ్డారు.

    వివరాలు 

    ముంబై మెట్రో పాలిటన్ రీజియన్‌లో కేబుల్ టాక్సీ వ్యవస్థ

    మహారాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఈ నిర్ణయాలను తీసుకుంటున్నట్లు మంత్రి సర్నాయక్ చెప్పారు.

    అలాగే, ప్రజలు ప్రైవేటు వాహనాలపై ఆధారపడకుండా ఉండేందుకు, మెట్రో రైలు, ఇతర ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపర్చడానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

    దీనికి సంబంధించి, ముంబై మెట్రో పాలిటన్ రీజియన్‌లో కేబుల్ టాక్సీ వ్యవస్థను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

    ఈ కొత్త నిబంధనలను త్వరలో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, డిప్యూటీ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో చర్చలు జరుపుతున్నారని మంత్రి ప్రతాప్ సర్నాయక్ చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర

    తాజా

    Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి థాయిలాండ్
    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర
    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి

    మహారాష్ట్ర

    Baba Siddique:ఫ్లైట్ మోడ్, వైఫై: బాబా సిద్ధిక్ హత్య నిందితుడు అన్మోల్ బిష్ణోయ్‌ని ఎలా సంప్రదించాడంటే..!  అన్మోల్‌ బిష్ణోయ్‌
    Defamation Notice: ఖర్గే, రాహుల్ గాంధీ, శ్రీనేట్‌లకు రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు భారతదేశం
    Maharashtra and Jharkhand elections: మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. కౌంటింగ్ ప్రారంభం జార్ఖండ్
    Maharashtra and Jharkhand elections: మహారాష్ట్రలో మహాయతి దూకుడు.. జార్ఖండ్ లో బీజేపీ ముందంజ జార్ఖండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025