NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi Railway Station: రైల్వే స్టేషన్‌లో  'ఉచిత' వీల్‌చైర్ సేవలకు ఎన్నారై నుంచి ₹10,000 వసూలుచేసిన పోర్టర్ 
    తదుపరి వార్తా కథనం
    Delhi Railway Station: రైల్వే స్టేషన్‌లో  'ఉచిత' వీల్‌చైర్ సేవలకు ఎన్నారై నుంచి ₹10,000 వసూలుచేసిన పోర్టర్ 
    రైల్వే స్టేషన్‌లో 'ఉచిత' వీల్‌చైర్ సేవలకు ఎన్నారై నుంచి ₹10,000 వసూలుచేసిన పోర్టర్

    Delhi Railway Station: రైల్వే స్టేషన్‌లో  'ఉచిత' వీల్‌చైర్ సేవలకు ఎన్నారై నుంచి ₹10,000 వసూలుచేసిన పోర్టర్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 02, 2025
    02:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో ఒక ఎన్నారైకు వీల్‌చైర్ సేవల కోసం రూ. 10 వేలు వసూలు చేసిన ఘటనను రైల్వే అధికారులు తీవ్రంగా పరిగణించారు.

    ఈ అంశంపై విచారణ చేపట్టడంతో పాటు సంబంధిత పోర్టర్ లైసెన్స్‌ను రద్దు చేశారు.

    అలాగే, ప్రయాణికుడి నుంచి వసూలు చేసిన మొత్తం డబ్బులో 90 శాతం తిరిగి ఇవ్వాలని ఆదేశించారు.

    ఇలాంటి చర్యలను సహించబోమని నార్తరన్ రైల్వేస్ స్పష్టం చేసింది. పోర్టర్ బ్యాడ్జ్‌ను ఢిల్లీ డివిజన్ అధికారులు వెనక్కి తీసుకున్నారు.

    ప్రయాణికుల ప్రయోజనాలు తమకు ముఖ్యమని రైల్వే మరోసారి స్పష్టం చేసింది.

    రైల్వే స్టేషన్లలో వీల్‌చైర్ సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయని గుర్తు చేసింది.

    వివరాలు 

     139 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచన

    కానీ, డిసెంబర్ 28న, తన తండ్రి నుంచి రూ. 10 వేలు వసూలు చేశారంటూ ఒక ఎన్నారై ప్రయాణికుడి కుమార్తె పాయల్, రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు.

    సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోర్టర్‌ను గుర్తించిన అధికారులు, అతడి నుంచి రూ. 9 వేలు తిరిగి తీసుకుని ప్రయాణికుడికి అందజేశారు.

    ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డివిజనల్ రైల్వే మేనేజర్, రైల్వే ప్రయాణికుల సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణానికి కట్టుబడి ఉందని తెలిపారు.

    ఇలాంటి సంఘటనలు రైల్వే ప్రతిష్ఠను దిగజారుస్తాయని, ప్రయాణికుల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు.

    బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రయాణికుల సమస్యలు ఎదురైతే 139 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    LIC Guinness record: 24 గంటల్లో 5.88 లక్షల పాలసీలు.. ఎల్‌ఐసీకి గిన్నిస్‌ రికార్డు గౌరవం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
    OG: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓజీ నుండి ఆసక్తికర అప్డేట్! పవన్ కళ్యాణ్
    Suzuki e-Access: సుజుకీ ఇ-యాక్సెస్‌ స్కూటర్‌ మార్కెట్లోకి రాకకు సిద్ధం ఆటో మొబైల్
    Monsoon: రైతులకు ఊరట.. కేరళని తాకిన రుతుపవనాలు భారత వాతావరణ శాఖ

    దిల్లీ

    CNG price hike: వాహనదారులకు మరో షాక్‌.. సీఎన్‌జీ ధరల పెంపు ముంబై
    Air Pollution: దిల్లీలో ఆంక్షల సడలింపునకు నో చెప్పిన సుప్రీం కోర్టు.. పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని సూచన వాయు కాలుష్యం
    old-age pension scheme: వృద్ధాప్య పెన్షన్ పథకం కోసం పోర్టల్‌ను ప్రారంభించిన ఢిల్లీ ప్రభుత్వం : ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే? పెన్షన్
    Air Pollution : దిల్లీలో పొగమంచు కమ్మేసింది.. వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కరి వాయు కాలుష్యం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025