NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra Pradesh: ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద కొత్తగా 71,380 స్పౌజ్‌ పింఛన్లు.. మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 
    తదుపరి వార్తా కథనం
    Andhra Pradesh: ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద కొత్తగా 71,380 స్పౌజ్‌ పింఛన్లు.. మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 
    ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద కొత్తగా 71,380 స్పౌజ్‌ పింఛన్లు

    Andhra Pradesh: ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద కొత్తగా 71,380 స్పౌజ్‌ పింఛన్లు.. మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 30, 2025
    08:23 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 71,380 మంది భార్యలకు (స్పౌజ్‌) పింఛన్లను మంజూరు చేసింది.

    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జూన్ 12నటికి ఒక సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా, అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా ఈ కొత్త స్పౌజ్ పింఛన్లను లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

    భార్యాభర్తలలో భర్త సామాజిక భద్రతా పింఛను పొందుతూ మృతిచెందితే, ఆ కుటుంబంలో భార్యకు వెంటనే తదుపరి నెల నుంచే పింఛను అందేలా కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా స్పౌజ్‌ పింఛను కేటగిరీని ప్రవేశపెట్టింది.

    ఈ పథకాన్ని గతేడాది నవంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి తీసుకువచ్చారు.

    వివరాలు 

     నిధులు గ్రామ, వార్డు సచివాలయాల ఖాతాల్లోకి జమ

    ఈ కేటగిరీకి సంబంధించి 2023 డిసెంబరు 1 నుండి 2024 అక్టోబరు 31 మధ్యకాలంలో అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించింది.

    అర్హత ప్రమాణాలను పరిశీలించిన తర్వాత మొత్తం 71,380 మందిని అర్హులుగా గుర్తించింది.

    ఈ పింఛన్లకు సంబంధించిన మే నెల నిధిగా ఒక్కొక్కరికి రూ. 4,000 చొప్పున జూన్ 12వ తేదీన పంపిణీ చేయనుంది.

    జూన్ 11 నాటికి ఈ మొత్తం నిధులు గ్రామ, వార్డు సచివాలయాల ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు.

    ఈ మేరకు సెర్ప్‌ (SERP) సీఈవో వాకాటి కరుణ గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Andhra Pradesh: ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద కొత్తగా 71,380 స్పౌజ్‌ పింఛన్లు.. మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం  ఆంధ్రప్రదేశ్
    Donald Trump: అమెరికా ప్రభుత్వం విధించిన సుంకాల అమలుపై.. మరో న్యాయస్థానం అనుకూల తీర్పు  డొనాల్డ్ ట్రంప్
    RCB vs PBKS : ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. చిత్తుగా ఓడిన పంజాబ్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Jonas Masetti: బ్రెజిల్‌కు చెందిన జొనాస్ మాసెట్టికి పద్మశ్రీ అవార్డు.. ఇంతకీ ఎవరీయన ? పద్మశ్రీ అవార్డు గ్రహీతలు

    ఆంధ్రప్రదేశ్

    Andhra Pradesh: బేబీ కిట్ పథకాన్ని పునరుద్ధరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా
    LG: ఆంధ్రప్రదేశ్‌లో ₹5,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఎల్జి.. 11,000+ వేల పరోక్ష ఉద్యోగాలు  బిజినెస్
    APSSC : ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబు పత్రాల మూల్యాంకనం కుంభకోణం.. ధాత్రి మధుకు 14రోజుల రిమాండ్‌ భారతదేశం
    Krishna Dist: నిఘా వర్గాలు హెచ్చరికలు..కృష్ణా జిల్లా సముద్ర తీరంలో హై అలర్ట్  కృష్ణా జిల్లా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025