NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Snake Bit : ఈ ప్రభుద్ధుడు మనిషే కాదు.. డబ్బు కోసం భార్య,బిడ్డలను పాముకాటుతో చంపాడు
    తదుపరి వార్తా కథనం
    Snake Bit : ఈ ప్రభుద్ధుడు మనిషే కాదు.. డబ్బు కోసం భార్య,బిడ్డలను పాముకాటుతో చంపాడు
    Snake Bit : ఈ ప్రభుద్ధుడు మనిషేనా..డబ్బు కోసం భార్య,బిడ్డలను పాముకాటుతో చంపాడు

    Snake Bit : ఈ ప్రభుద్ధుడు మనిషే కాదు.. డబ్బు కోసం భార్య,బిడ్డలను పాముకాటుతో చంపాడు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 24, 2023
    05:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒడిశాలో ఘోరం జరిగింది. ఓ ప్రభుద్ధుడు భార్యా బిడ్డల్ని పాముకాటుతో చంపించిన అతి తీవ్ర విషాద ఘటన ఆ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

    రూ.8 లక్షల బీమా పరిహారం కోసం భార్యను, కూతురును కర్కశంగా పాముతో కాటేసి చంపేసిన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

    45 రోజుల క్రితం జరిగిన ఈవిషాద ఘటనలో గురువారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

    గంజాం జిల్లాలోని అధెగావ్'లో గణేష్ పాత్ర,భార్య బసంతి,కుమార్తెతో కలిసి నివసిస్తున్నాడు.మూడేళ్ల క్రితం ఈ జంటకు వివాహం జరిగింది. కుమార్తె పేరు దేబాస్మిత.

    కుటుంబాన్నిఅంతం చేసేందుకు అక్టోబర్ 6న ఓ ప్లాస్టిక్ జార్ లో ఓ భయంకర పామును పట్టుకొచ్చి భార్యా పిల్లలు నిద్రిస్తున్న గదిలో విడిచి తాను మాత్రం మరో గదిలో నిద్రించాడు.

    details

    ఏమీ తెలియనట్లు దొంగ ఏడ్పులు ఏడ్చాడు, చివరకు కటకటాల పాలయ్యాడు

    దీంతో ఆ విషసర్పం తన భార్యా, బిడ్డల్ని కాటు వేసింది. తెల్లారేసరికి ఇద్దరూ ప్రాణం విడిచారు. మరునాడు గణేశ్ ఏమీ తెలియనట్లుగా భార్యా బిడ్డలు పాము కరిచి చనిపోయారని దొంగ ఏడ్పులు ఏడ్చి అందరినీ నమ్మించాడు. చివరకు పోలీసులనూ అదే మాటతో నమ్మబలికాడు.

    అయితే బసంతి తండ్రి తనకు అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

    ఈ క్రమంలోనే గణేశ్'ను అదుపులోకి తీసుకున్నారు. తానే ఆ పామును తీసుకొచ్చి వారి గదిలో వేశానని విచారణలో అంగీకరించాడు.

    నెలన్నర తర్వాత నిందితుడిని తాజాగా అరెస్ట్ చేశామని గంజాం జిల్లా ఎస్పీ జగ్మోమన్ మీనా తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    భార్యా బిడ్డలను దారుణంగా క్రూరంగా చంపిన ప్రభుద్ధుడు

    Odisha: Man kills wife and 2-year-old daughter using a cobra for Rs 8 lakh ‘snakebite’ compensation, arrestedhttps://t.co/m6X9aK5Thu

    — OpIndia.com (@OpIndia_com) November 24, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఒడిశా

    తాజా

    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్

    ఒడిశా

    లండన్‌లో జగన్నాథ ఆలయ నిర్మాణం; ప్రవాస ఒడిశా వ్యాపారి 25మిలియన్ పౌండ్ల విరాళం పూరీ జగన్నాథ దేవాలయం
    'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్; వంద ఇసుక రేడియోలతో అబ్బురపరిచే సైకత శిల్పం మన్ కీ బాత్
    దిల్లీలో మే 18 వరకు ఈదురుగాలులు; రాబోయే 5 రోజుల పాటు ఒడిశాలో వేడిగాలులు దిల్లీ
    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆ రెండు పార్టీలు రెడీ  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025