Telangana: పీజీ వైద్య విద్య ప్రవేశాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు
ఈ వార్తాకథనం ఏంటి
పీజీ వైద్య కోర్సుల్లో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 200, 201 ప్రకారం, 'ఎంక్యూ1' కోటాలో 85 శాతం స్థానాలను స్థానిక అభ్యర్థులకు రిజర్వ్ చేసింది. ఈ నిబంధనలకు అనుగుణంగా అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయం సూచించింది. అలాగే 'ఎంక్యూ2', 'ఎన్ఆర్ఐ','ఇన్స్టిట్యూషనల్ కోటా' కింద వచ్చే అభ్యర్థులు కూడా బుధవారం సాయంత్రం 5 గంటల లోపు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలని వర్సిటీ స్పష్టం చేసింది. నీట్ పీజీ-2025లో అర్హత ప్రమాణాలు ఇలా ఉన్నాయి:
వివరాలు
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు 40 పర్సంటైల్ 235 మార్కులు పొందిన వారు అర్హులని వర్సిటీ పేర్కొంది.
జనరల్,ఈడబ్ల్యూఎస్ వర్గాల అభ్యర్థులు 50 పర్సంటైల్ అంటే 276 మార్కులు సాధించి ఉండాలి. జనరల్ పీడబ్ల్యూడీ అభ్యర్థులు 45 పర్సంటైల్ (255 మార్కులు) సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు 40 పర్సంటైల్ (235 మార్కులు) పొందితే అర్హులుగా పరిగణిస్తారు. వర్సిటీ ఈ వివరాలను విడుదల చేస్తూ, అర్హులైన అభ్యర్థులు నిర్దిష్ట సమయానికి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించింది.