No Confidence Motion: మణిపూర్ సీఎం బీరెన్సింగ్ రాజీనామా చేయాలి: ప్రతిపక్ష ఎంపీల డిమండ్
నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో వాడీ వేడగా చర్చ జరుగుతోంది. మణిపూర్లో జరిగిన హింసాకాండకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష ఎంపీలు మంగళవారం డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ సుప్రియా సూలే మాట్లాడుతూ, మణిపూర్లో మే 3 నుండి 150 మందికి పైగా మరణించారన్నారు. మణిపూర్లో చెలరేగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గుచేటన్నారు. ఈ రోజు సభ ముగిసే లోగా సీఎం ఎన్ బీరెన్ సింగ్ రాజీనామా చేయాలని ఆమె పట్టుబట్టారు. ద్రవ్యోల్బణం, మత సామరస్యాన్ని కాపాడటం, దర్యాప్త సంస్థల స్వతంత్రతను కాపాడటం వంటి అనేక ఇతర అంశాల్లో కేంద్రం ఘోరంగా విఫలమైందని ప్రతిపక్ష ఎంపీలు పేర్కొన్నారు.
ఫెడరలిజాన్ని మోదీ నాశనం చేస్తున్నారు: టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్
దేశంలో ఫెడరలిజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నాశనం చేస్తున్నారని టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి హృదయం అనేది లేదన్నారు. పశ్చిమ బెంగాల్లో ఏ చిన్న సంఘటన జరిగిన కేంద్ర బృందాలను పంపుతున్నారని, కానీ మణిపూర్ మండిపోతున్నా, అక్కడి సోదరులు, సోదరీమణులు మరణిస్తున్న మణిపూర్కు ఒక్క ప్రతినిధిని పంపలేదన్నారు. మోదీకి కనికరం లేదని, అందుకే మణిపూర్ వెళ్ళలేదని మండిడ్డారు. బీరెన్ సింగ్ నేతృత్వంలోని మణిపూర్ ప్రభుత్వం విఫలమైందన్నారు. మణిపూర్లో తక్షణమే బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.