NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / padma awards 2023: ములాయం, ఎస్ఎం కృష్ణ, మహలనాబిస్‌కు పద్మ విభూషణ్- 106 మందిని వరించిన పద్మ అవార్డులు
    తదుపరి వార్తా కథనం
    padma awards 2023: ములాయం, ఎస్ఎం కృష్ణ, మహలనాబిస్‌కు పద్మ విభూషణ్- 106 మందిని వరించిన పద్మ అవార్డులు
    రిపబ్లిక్‌ డే సందర్భంగా పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

    padma awards 2023: ములాయం, ఎస్ఎం కృష్ణ, మహలనాబిస్‌కు పద్మ విభూషణ్- 106 మందిని వరించిన పద్మ అవార్డులు

    వ్రాసిన వారు Stalin
    Jan 25, 2023
    10:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎస్పీ వ్యవస్థాపకులు, దివంగత ములాయం సింగ్ యాదవ్, సంగీతకారుడు జాకీర్ హుస్సేన్, ఓఆర్‌ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) సృష్టికర్త ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు దివంగత దిలీప్ మహలనాబిస్‌, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణకు దేశ రెండో అత్యున్నత పురస్కారం అయిన పద్మవిభూషణ్‌ను కేంద్రం ప్రకటించింది.

    2023 గణతంత్ర వేడుకల సందర్భంగా ఈ ఏడాది 6 పద్మ విభూషణ్, 9 పద్మ భూషణ్, 91 పద్మశ్రీ అవార్డుల ప్రదానానికి రాష్ట్రపతి ముర్ము ఆమోద ముద్ర వేశారు. మొత్తం 106 అవార్డుల్లో 19 మంది గ్రహితలు మహిళలు కావడం గమనార్హం. ఇందులో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. ములాయం, దిలీప్ మహలనాబిస్‌ సహా ఏడుగురు మరణానంతర అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    2023 ఏడాదికి గాను మొత్తం 106మందికి పద్మ అవార్డుల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం

    For 2023, the President has approved conferment of 106 Padma Awards incl 3 duo cases. The list comprises 6 Padma Vibhushan, 9 Padma Bhushan 91 Padma Shri. 19 awardees are women the list also includes 2 persons from category of Foreigners/NRI/PIO/OCI and 7 Posthumous awardees pic.twitter.com/Gl4t6NGSzs

    — ANI (@ANI) January 25, 2023

    పద్మ అవార్డులు

    చిన జీయర్ స్వామికి పద్మ భూషణ్, ఎంఎం కీరవాణికి పద్మశ్రీ

    పద్మ అవార్డుల గ్రహితల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు. తెలంగాణ నుంచి ప్రముఖ ఆద్యాత్మిక వేత్త చిన జీయర్ స్వామి, కమలేష్ డి పటేల్ ఇద్దరూ పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు.

    సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో విశేష కృషి చేసిన మోదడుగు విజయ్ గుప్తా, పసుపులేటి హన్మంతరావు( వైద్యం), సాహిత్యం రంగానికి చెందిన బి. రామకృష్ణా రెడ్డిని పద్మశ్రీ అవార్డు వరించింది.

    ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో గణేశ్ నాగప్ప, అబ్బారెడ్డి నాగేశ్వరరావు, ఆర్ట్ విభాగంలో సీవీ రాజు, సచ్చిదానంద శాస్త్రి, సామాజికసేవ విభాగంలో సంకురాత్రి చంద్రశేఖర్, సాహిత్యం, విద్య విభాగంలో ప్రకాశ్ చంద్ర సూద్‌లు పద్మశ్రీకి ఎంపికయ్యారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్
    Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం మెట్రో స్టేషన్
    Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని పాకిస్థాన్
    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025