NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / India-Pakistan: ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్థాన్‌కు నిధులు ఇవ్వొద్దు.. ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌కు భారత్‌ విజ్ఞప్తి 
    తదుపరి వార్తా కథనం
    India-Pakistan: ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్థాన్‌కు నిధులు ఇవ్వొద్దు.. ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌కు భారత్‌ విజ్ఞప్తి 
    ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్థాన్‌కు నిధులు ఇవ్వొద్దు

    India-Pakistan: ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్థాన్‌కు నిధులు ఇవ్వొద్దు.. ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌కు భారత్‌ విజ్ఞప్తి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 05, 2025
    04:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి పాకిస్థాన్ సీమాంతర కుట్రే కారణమని భారత్ పేర్కొంది.

    దాయాదికి గట్టిగా బుద్ధి చెప్పేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది.

    ముఖ్యంగా ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే ప్రధాన లక్ష్యంగా మరో చర్యను చేపట్టింది.

    పాకిస్తాన్‌కు ఉగ్రవాదాన్ని పెంచడానికి నిధులు అందించకూడదని ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ)ను కోరింది.

    ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఏడీబీ చీఫ్ మసాటో కాందతో ఇటీవల భేటీ అయినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

    ఈ విషయంపై ఇటలీ ఆర్థిక మంత్రి, పలు ఐరోపా దేశాల నేతలతోనూ నిర్మలమ్మ చర్చలు జరిపినట్లు కూడా ఆ వర్గాలు వెల్లడించాయి.

    ఇప్పటికే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF)గ్రేలిస్టులో పాకిస్తాన్‌ను పెట్టేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది.

    వివరాలు 

    పాకిస్తాన్‌పై మరో భారీ ఆర్థిక దెబ్బ

    అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF)నుంచి పాకిస్తాన్‌కు అందే 7 బిలియన్ డాలర్ల సాయంపై న్యూదిల్లీ ఆందోళన వ్యక్తం చేయనుంది.

    తాజాగా,ఏడీబీ నుంచి పాకిస్తాన్‌కు అందే నిధులను కూడా నిలిపివేయాలని భారత్ అభ్యర్థన చేసింది.

    న్యూదిల్లీ అభ్యర్థనకు అంగీకరించి,పాక్‌కు నిధులు ఆపేస్తే, ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయిన పాకిస్తాన్‌పై మరో భారీ ఆర్థిక దెబ్బ పడుతుంది.

    ఇదిలా ఉంటే,ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమేశ్వరన్ అయ్యర్‌కు,అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF)లో తాత్కాలిక విధులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

    మే 9న జరగనున్న సమావేశం నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.

    గత ఏడాది జులైలో ఐఎంఎఫ్-పాకిస్తాన్ మధ్య 7బిలియన్ డాలర్ల ప్యాకేజీ కోసం ఒప్పందం ఖరారైంది.

    ఆ రోజున పాకిస్తాన్ బెయిలౌట్ ప్యాకేజీపై సమీక్ష కూడా జరగనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నిర్మలా సీతారామన్

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    నిర్మలా సీతారామన్

    Nirmala Sitharaman:7వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  భారతదేశం
    PM Surya Ghar: బడ్జెట్లో నిధులే నిధులు.. కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్  కేంద్ర ప్రభుత్వం
    Budget 2024: కేంద్ర బడ్జెట్‌లో రైల్వే శాఖకు నిరాశే.. కొత్త రైళ్లు లేవు కేంద్ర ప్రభుత్వం
    PM Narendra Modi: యువతకు,మధ్య తరగతి ప్రజలకు పెద్దపీట..కేంద్ర బడ్జెట్‌పై నరేంద్ర మోదీ ప్రశంసలు బడ్జెట్ 2024
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025