NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / LoC: ఎల్‌ఓసీ వెంబడి మరోసారి పాక్‌ కాల్పులు.. 12వ రోజూ సరిహద్దుల్లో ఉద్రిక్తత
    తదుపరి వార్తా కథనం
    LoC: ఎల్‌ఓసీ వెంబడి మరోసారి పాక్‌ కాల్పులు.. 12వ రోజూ సరిహద్దుల్లో ఉద్రిక్తత
    ఎల్‌ఓసీ వెంబడి మరోసారి పాక్‌ కాల్పులు.. 12వ రోజూ సరిహద్దుల్లో ఉద్రిక్తత

    LoC: ఎల్‌ఓసీ వెంబడి మరోసారి పాక్‌ కాల్పులు.. 12వ రోజూ సరిహద్దుల్లో ఉద్రిక్తత

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 06, 2025
    09:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ మరోసారి ఉల్లంఘించింది.

    నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాకిస్థాన్ సైనికులు వరుసగా 12వ రోజు కూడా కాల్పులకు పాల్పడ్డారు. సోమవారం రాత్రి జమ్ముకశ్మీర్‌లోని మొత్తం 8 సెక్టార్లలో పాక్ కవ్వింపు చర్యలు చేపట్టింది.

    కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరీ, మెంధార్, నౌషెరా, సుందర్బని, అఖ్నూర్ సెక్టార్లలో కాల్పులు జరపడంతో భారత సైనికులు సమర్థంగా ప్రతీకారం తీశారు.

    ఏప్రిల్ 22న శ్రీనగర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌కు సింధూ జలాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

    దీనిపై అసహనం వ్యక్తం చేస్తూ పాక్ సైన్యం కాల్పులకు తెగబడినట్లు భావిస్తున్నారు.

    Details

    ఉగ్ర స్థావరం గుర్తించిన భద్రతా బలగాలు 

    పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా దళాలు, జమ్ము కశ్మీర్‌లో మరో కీలక విజయం సాధించాయి.

    పూంచ్ జిల్లా సురాన్‌కోట్ ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాన్ని గుర్తించారు. ఈ స్థావరంలో టిఫిన్ బాక్సుల్లో మూడు, స్టీల్ బకెట్లలో రెండు ఐఈడీలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

    ఇవన్నీ భారీ విస్ఫోటాలకు దారి తీసే సామర్థ్యం కలిగినవని అధికారులు వెల్లడించారు.

    ఉగ్రదాడుల ముప్పు నేపథ్యంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు మరింత వేగవంతం చేస్తున్నాయి.

    భారత్ సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులు నాజూకుగా మారుతున్న నేపథ్యంలో, కేంద్రం పరిస్థితిని సమీక్షిస్తూ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శ్రీనగర్

    తాజా

    Canada: కెనడా మంత్రివర్గంలో భారతీయ మూలాల నేతలకు కీలక పదవులు  కెనడా
    Shubhanshu Shukla: జూన్‌ 8న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ లాంచ్ కాంప్లెక్స్ నుండి అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా నాసా
    Ap news: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
    Encounter: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. ఉగ్రవాది హతం..! జమ్ముకశ్మీర్

    శ్రీనగర్

    మారిన శ్రీనగర్ ముఖచిత్రం; స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్రీ వైఫై జోన్లుగా 8ప్రాంతాలు జమ్ముకశ్మీర్
    నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం; భద్రత కట్టుదిట్టం  జీ20 సమావేశం
    జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి  జమ్మూ
    శ్రీనగర్‌- బారాముల్లా హైవేపై భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం  జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025