
Pahalgam terror attack: పహల్గాం తరహాలో మరోదాడి జరగొచ్చు: లెఫ్టినెంట్ జనరల్ కటియార్
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం దాడి తరహాలో పాకిస్థాన్ మరోసారి దాడి చేయడానికి ప్రయత్నించవచ్చని వెస్ట్రన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ హెచ్చరించారు. అలాంటి చర్యలు జరిగితే, భారత్ నుండి తీవ్రమైన ప్రతిస్పందన తప్పదని ఆయన స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్లో మాట్లాడుతున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. లెఫ్టినెంట్ జనరల్ కటియార్ మాట్లాడుతూ.. "ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్కు ఘనమైన బదులిచ్చాం. అయినప్పటికీ ఆ దేశం తన తీరును మార్చుకునే సూచనలు కనిపించడం లేదు. పహల్గాం తరహాలో మళ్లీ దాడి చేయాలని ప్రయత్నించవచ్చు. అందుకే దాని ప్రతి కదలికను మేం జాగ్రత్తగా గమనిస్తున్నాం. ఈసారి అలాంటి దుశ్చర్యలకు పాల్పడితే, మన సమాధానం మరింత కఠినంగా ఉంటుంది" అని హెచ్చరించారు.
వివరాలు
పహల్గాంలో ఉగ్రదాడి
గత ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్లోని పహల్గాం సమీపంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం బైసరన్ లోయలో ఉగ్రదాడి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సైనిక దుస్తులు ధరించి వచ్చిన దుండగులు పర్యాటకులపై అతి సమీపం నుండి కాల్పులు జరిపారు. ఈ భయంకర ఘటనలో ఒక కశ్మీరీతో పాటు మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పహల్గాం తరహాలో మరోదాడి జరగొచ్చు: లెఫ్టినెంట్ జనరల్ కటియార్
‘Pakistan again attempted a nefarious terror attack but Indian Army responded strongly’: West Army Commander Lt. Gen Manoj Kumar Katiyar warns against another Pahalgam-like attack
— Republic (@republic) October 14, 2025
Tune in to LIVE TV for all the fastest #BREAKING alerts - https://t.co/d88C3t2tGa pic.twitter.com/7EWGB955PA