Budget Sessions 2024: ప్రపంచంలోని టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో భారత్: ద్రౌపది ముర్ము
ఈ వార్తాకథనం ఏంటి
2024 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం కొత్త పార్లమెంట్ భవనంలో ప్రారంభం అయ్యాయి.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పార్లమెంటులో బడ్జెట్ సెషన్ 2024ను ప్రారంభించారు.
కొత్త పార్లమెంట్ భవనంలోని లోక్సభ ఛాంబర్లో లోక్సభ,రాజ్యసభ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు.
గత రెండు త్రైమాసికాల నుండి భారతదేశ జిడిపి 7.5శాతానికి పైగా వృద్ధి చెందిందని రాష్ట్రపతి అన్నారు.
ఈ సందర్భంగా దేశం సాధించిన విజయాలను ప్రశంసించారు.మొదటిసారిగా దేశంలో పెద్ద స్థాయిలో పేదరిక నిర్మూలనను చూస్తున్నామన్నారు.
ఈ ప్రభుత్వ హయాంలో సుమారు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి విముక్తి పొందారని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు.
ప్రపంచంలోని టాప్ 5 ఆర్థికవ్యవస్థల్లో భారత్ చోటు దక్కించుకున్నందుకు రాష్ట్రపతి ప్రశంసించారు.
Details
4 కోట్ల పేద కుటుంబాలు 'పక్కా'గృహాలు
నేడు మన బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత పటిష్టంగా మారిందని,మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ నేడు మన బలాలుగా మారాయని,మొబైల్ తయారీ 5 శాతానికి పైగా పెరిగిందని ఆమె అన్నారు.
"యువశక్తి,మహిళా శక్తి,రైతులు,పేదలు,అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి నాలుగు స్తంభాలు" అని రాష్ట్రపతి అన్నారు.
COVID-19 నుండి,80 కోట్ల మంది ప్రజలు ఉచిత రేషన్ పొందుతున్నారు. 4 కోట్ల పేద కుటుంబాలు 'పక్కా'గృహాలను పొందాయని ఆమె అన్నారు.
డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అభివృద్ధి చెందిన దేశాలను కూడా డిజిటల్ ఇండియా అధిగమించింది. డిజిటల్ ఇండియా వ్యాపారం,బ్యాంకింగ్,ట్రేడింగ్ను సులభతరం చేసింది.
UPIని ఇతర దేశాలు కూడా ఉపయోగిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.UPIలో, గత నెలలో 1,200 కోట్ల లావాదేవీలు జరిగాయి," అని రాష్ట్రపతి తెలిపారు.
Details
ముద్రా పథకం కింద మహిళలకు రుణాలు
ఆయుష్మాన్ భారత్ కింద 53 కోట్ల మంది తమ డిజిటల్ ఐడీలను తయారు చేసుకున్నారని ఆమె తెలిపారు.
రక్షణ,అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగాయి. దేశంలో మహిళలు స్వతంత్రులుగా, విజయం సాధించేందుకు సహాయం చేయడంపై రాష్ట్రపతి మాట్లాడుతూ, "నేడు మహిళలు కూడా ఫైటర్ పైలట్లుగా ఉన్నారన్నారు.
ముద్రా పథకం కింద మహిళలకు 31 కోట్లకు పైగా రుణాలు అందించబడ్డాయి. 10 కోట్ల మంది మహిళలు ఆర్థికంగా స్వాతంత్ర్యం పొందేందుకు ప్రభుత్వం సహాయపడిందన్నారు.
వ్యవసాయ రంగం సాధించిన విజయాల గురించి రాష్ట్రపతి మాట్లాడుతూ, రైతులకు సబ్సిడీ ధరలకు ఎరువులు అందజేసేందుకు రెండేళ్లలో రూ. 11 లక్షల కోట్లువెచ్చించినట్లు తెలిపారు.
Details
దేశంలో వేగంగా 5G విస్తరణ
కిసాన్ క్రెడిట్ పథకం ద్వారా మత్స్యకారులు, పశుపోషణకు లబ్ధి చేకూరిందన్నారు.
'దేశంలో 5జీ నెట్వర్క్ వేగంగా విస్తరిస్తోందన్నరాష్ట్రపతి ఆదివాసీలు నేడు 5G ఇంటర్నెట్కు ప్రాప్యతను పొందుతున్నారని తెలిపారు.
"నేడు లక్షద్వీప్ నీటి అడుగున ఫైబర్తో అనుసంధానించబడి ఉంది" అని రాష్ట్రపతి అన్నారు.
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.తెలంగాణలో సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతోంది.
దేశంలో 10 లక్షల కిలోమీటర్ల పైప్లైన్ నిర్మించుకున్నాం. కాశ్మీర్లో 370 ఆర్టికల్ ఎత్తివేయడం చారిత్రక నిర్ణయం" అని రాష్ట్రపతి పేర్కొన్నారు.