NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Budget Sessions 2024: ప్రపంచంలోని టాప్‌ 5 ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌: ద్రౌపది ముర్ము 
    తదుపరి వార్తా కథనం
    Budget Sessions 2024: ప్రపంచంలోని టాప్‌ 5 ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌: ద్రౌపది ముర్ము 
    ప్రపంచంలోని టాప్‌ 5 ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌: ద్రౌపది ముర్ము

    Budget Sessions 2024: ప్రపంచంలోని టాప్‌ 5 ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌: ద్రౌపది ముర్ము 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 31, 2024
    12:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2024 పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం కొత్త పార్లమెంట్‌ భవనంలో ప్రారంభం అయ్యాయి.

    ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పార్లమెంటులో బడ్జెట్ సెషన్ 2024ను ప్రారంభించారు.

    కొత్త పార్లమెంట్ భవనంలోని లోక్‌సభ ఛాంబర్‌లో లోక్‌సభ,రాజ్యసభ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు.

    గత రెండు త్రైమాసికాల నుండి భారతదేశ జిడిపి 7.5శాతానికి పైగా వృద్ధి చెందిందని రాష్ట్రపతి అన్నారు.

    ఈ సందర్భంగా దేశం సాధించిన విజయాలను ప్రశంసించారు.మొదటిసారిగా దేశంలో పెద్ద స్థాయిలో పేదరిక నిర్మూలనను చూస్తున్నామన్నారు.

    ఈ ప్రభుత్వ హయాంలో సుమారు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి విముక్తి పొందారని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు.

    ప్రపంచంలోని టాప్‌ 5 ఆర్థికవ్యవస్థల్లో భారత్‌ చోటు దక్కించుకున్నందుకు రాష్ట్రపతి ప్రశంసించారు.

    Details 

    4 కోట్ల పేద కుటుంబాలు 'పక్కా'గృహాలు 

    నేడు మన బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత పటిష్టంగా మారిందని,మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ నేడు మన బలాలుగా మారాయని,మొబైల్ తయారీ 5 శాతానికి పైగా పెరిగిందని ఆమె అన్నారు.

    "యువశక్తి,మహిళా శక్తి,రైతులు,పేదలు,అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి నాలుగు స్తంభాలు" అని రాష్ట్రపతి అన్నారు.

    COVID-19 నుండి,80 కోట్ల మంది ప్రజలు ఉచిత రేషన్ పొందుతున్నారు. 4 కోట్ల పేద కుటుంబాలు 'పక్కా'గృహాలను పొందాయని ఆమె అన్నారు.

    డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో అభివృద్ధి చెందిన దేశాలను కూడా డిజిటల్ ఇండియా అధిగమించింది. డిజిటల్ ఇండియా వ్యాపారం,బ్యాంకింగ్,ట్రేడింగ్‌ను సులభతరం చేసింది.

    UPIని ఇతర దేశాలు కూడా ఉపయోగిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.UPIలో, గత నెలలో 1,200 కోట్ల లావాదేవీలు జరిగాయి," అని రాష్ట్రపతి తెలిపారు.

    Details 

    ముద్రా పథకం కింద మహిళలకు రుణాలు

    ఆయుష్మాన్ భారత్ కింద 53 కోట్ల మంది తమ డిజిటల్ ఐడీలను తయారు చేసుకున్నారని ఆమె తెలిపారు.

    రక్షణ,అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగాయి. దేశంలో మహిళలు స్వతంత్రులుగా, విజయం సాధించేందుకు సహాయం చేయడంపై రాష్ట్రపతి మాట్లాడుతూ, "నేడు మహిళలు కూడా ఫైటర్ పైలట్‌లుగా ఉన్నారన్నారు.

    ముద్రా పథకం కింద మహిళలకు 31 కోట్లకు పైగా రుణాలు అందించబడ్డాయి. 10 కోట్ల మంది మహిళలు ఆర్థికంగా స్వాతంత్ర్యం పొందేందుకు ప్రభుత్వం సహాయపడిందన్నారు.

    వ్యవసాయ రంగం సాధించిన విజయాల గురించి రాష్ట్రపతి మాట్లాడుతూ, రైతులకు సబ్సిడీ ధరలకు ఎరువులు అందజేసేందుకు రెండేళ్లలో రూ. 11 లక్షల కోట్లువెచ్చించినట్లు తెలిపారు.

    Details 

    దేశంలో వేగంగా 5G విస్తరణ 

    కిసాన్ క్రెడిట్ పథకం ద్వారా మత్స్యకారులు, పశుపోషణకు లబ్ధి చేకూరిందన్నారు.

    'దేశంలో 5జీ నెట్‌వర్క్‌ వేగంగా విస్తరిస్తోందన్నరాష్ట్రపతి ఆదివాసీలు నేడు 5G ఇంటర్నెట్‌కు ప్రాప్యతను పొందుతున్నారని తెలిపారు.

    "నేడు లక్షద్వీప్ నీటి అడుగున ఫైబర్‌తో అనుసంధానించబడి ఉంది" అని రాష్ట్రపతి అన్నారు.

    ఐటీ రిటర్న్స్‌ ఫైల్‌ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.తెలంగాణలో సమ్మక్క-సారక్క ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతోంది.

    దేశంలో 10 లక్షల కిలోమీటర్ల పైప్‌లైన్‌ నిర్మించుకున్నాం. కాశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ ఎత్తివేయడం చారిత్రక నిర్ణయం" అని రాష్ట్రపతి పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బడ్జెట్

    తాజా

    Smriti Mandhana: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌.. రెండో స్థానానికి స్మృతి మంధాన స్మృతి మంధాన
    BR Gavai: సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ ప్రమాణస్వీకారం  సుప్రీంకోర్టు
    India-China: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్నిప్రాంతాలకు పేర్లు పెట్టిన చైనా.. తీవ్రంగా మండిపడిన భారత విదేశాంగ శాఖ.. రణ్‌ధీర్‌ జైస్వాల్‌
    Anita Anand: కెనడా విదేశాంగ మంత్రిగా భారత సంతతికి చెందిన అనితా ఆనంద్.. ఎవరీమె? అనితా ఆనంద్

    బడ్జెట్

    బడ్జెట్ 2023లో రూ.16 లక్షల కోట్లకు చేరుకోనున్నప్రభుత్వ రుణాలు రుణం
    Budget 2023: 'రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం', పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము ద్రౌపది ముర్ము
    ఆర్థిక సర్వే 2023: బడ్జెట్ వేళ ఆర్థిక సర్వే ప్రాముఖ్యతను తెలుసుకోండి ఆర్థిక శాఖ మంత్రి
    తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ తమిళసై ప్రసంగం ఎలా ఉండబోతోంది? తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025