తదుపరి వార్తా కథనం
    
     
                                                                                Assam: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం..లారీ-బస్సు ఢీ.. 14 మంది మృతి
                వ్రాసిన వారు
                Sirish Praharaju
            
            
                            
                                    Jan 03, 2024 
                    
                     09:10 am
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
అస్సాంలోని డెర్గావ్లో బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు 45 మందితో వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో కనీసం 14 మంది మరణించగా, 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. అథ్ఖెలియా నుండి బలిజన్కు 45 మంది సభ్యులతో వెళుతున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. రెండు వాహనాల డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన వారిని దేర్గావ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన వారిని జోర్హాట్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (జేఎంసిహెచ్)కి తరలించారు. బస్సులోని ప్రయాణించే వారిలో ఎక్కువ మంది బరలుఖువా గ్రామానికి చెందినవారు, టిన్సుకియాలోని తిలింగ ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం
#BreakingNews 14 killed, 27 injured as picnic bus collides with truck in Assam's Dergaon#Assam #Roadaccident
— Kalinga TV (@Kalingatv) January 3, 2024