Loading...
PM Modi: పేపర్‌ లీక్‌లపై మరింత కఠిన చర్యలు.. కొత్త బిల్లుకు కేంద్రం సిద్ధం
పేపర్‌ లీక్‌లపై మరింత కఠిన చర్యలు.. కొత్త బిల్లుకు కేంద్రం సిద్ధం

PM Modi: పేపర్‌ లీక్‌లపై మరింత కఠిన చర్యలు.. కొత్త బిల్లుకు కేంద్రం సిద్ధం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2026
08:01 am

ఈ వార్తాకథనం ఏంటి

పరీక్షల ప్రశ్నపత్రాల లీక్‌ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల లీక్‌లను పూర్తిగా అరికట్టే లక్ష్యంతో రూపొందించిన బిల్లుపై శుక్రవారం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని, అనంతరం దానిని వీలైనంత త్వరగా పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తామని వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేసిన ప్రధాని, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేవలం 12 గంటల వ్యవధిలోనే ఈ అంశంపై రెండోసారి స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వివరాలు 

లీక్‌లపై మరిన్ని కఠిన చర్యలుంటాయని స్పష్టీకరణ

వీడియో సందేశంలో ప్రధాని మాట్లాడుతూ, ప్రశ్నపత్రాల లీక్‌ అనేది సాధారణ విషయం కాదని, ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపినట్లు తెలిపారు.

విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూడటమే కేంద్ర ప్రభుత్వ అత్యంత ముఖ్యమైన బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు.

అందుకే ఆలస్యం చేయకుండా తిరిగి పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. అయితే పరీక్షలు నిర్వహించడంతో ప్రభుత్వ బాధ్యత ముగిసిపోలేదని ప్రధాని స్పష్టం చేశారు.

ప్రశ్నపత్రాల లీక్‌ల కారణంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో గత రెండున్నర నెలలుగా పలు కీలక చర్యలు చేపట్టామని, ఇకపై మరిన్ని కఠిన నిర్ణయాలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

వివరాలు 

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు

పేపర్‌ లీక్‌ కేసుల విచారణ వేగవంతం చేసేందుకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు మోదీ తెలిపారు.

అలాగే శుక్రవారం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో లీక్‌ల నియంత్రణ బిల్లుపై సమగ్రంగా చర్చించి, అనంతరం దానిని పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టంగా తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అర్ధరాత్రి వీడియో సందేశంలో ప్రధాని మోదీ 

ADVERTISEMENT