NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: జనవరి 22న ప్రజలు అయోధ్యకు రావొద్దు: ప్రధాని మోదీ పిలుపు
    తదుపరి వార్తా కథనం
    PM Modi: జనవరి 22న ప్రజలు అయోధ్యకు రావొద్దు: ప్రధాని మోదీ పిలుపు
    PM Modi: జనవరి 22 కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది: ప్రధాని మోదీ

    PM Modi: జనవరి 22న ప్రజలు అయోధ్యకు రావొద్దు: ప్రధాని మోదీ పిలుపు

    వ్రాసిన వారు Stalin
    Dec 30, 2023
    03:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జనవరి 22వ తేదీన జరిగే చారిత్రాత్మక ఘట్టం కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

    జనవరి 22న అయోధ్య శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్న విషయం తెలిసిందే.

    ఈ క్రమంలో అయోధ్యకు కనక్టివిటీని పెంచేందుకు శనివారం మోదీ అయోధ్యలో రైల్వే స్టేషన్, ఆరు వందే భారత్, రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సహా మొత్తం రూ.15,700 కోట్లతో 46 అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభించారు.

    ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. డిసెంబర్ 30వ తేదీ దేశ చరిత్రలో ఎంతో చారిత్రాత్మకమైనదన్నారు.

    1943లో ఇదే రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండమాన్‌లో జెండాను ఎగురవేసి భారతదేశానికి స్వాతంత్య్రాన్ని ప్రకటించారన్నారు.

    మోదీ

    జనవరి 22న ఇళ్లలో శ్రీరామ జ్యోతిని వెలిగించండి: ప్రధాని మోదీ 

    దేశంలోని పలు ప్రాంతాల నుంచి అయోధ్యకు కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

    జనవరి 22న అయోధ్యకు రావద్దని ప్రజలను ప్రధాని మోదీ కోరారు.

    కేవలం కొందరికే ఆహ్వానం అందిందని, వారు మాత్రమే వస్తారని పేర్కొన్నారు. ఎక్కువ సంఖ్యలో హాజరై ఇబ్బంది పెట్టొద్దన్నారు.

    జనవరి 22న తర్వాత ఇక్కడి వచ్చేందుకు ప్లాన్ చేసుకోవాలని మోదీ కోరారు.

    జనవరి 14-21 వరకు దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాల వద్ద పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. అందులో భాగంగానే అయోధ్యలో కూడా చేపట్టాలన్నారు.

    జనవరి 22న దేశ ప్రజలందరూ తమ ఇళ్లలో శ్రీరామజ్యోతిని వెలిగించి దీపావళి జరుపుకోవాలని 140 కోట్ల మంది దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

    అయోధ్య

    యూపీ అభివృద్ధికి అయోధ్య దోహదం: మోదీ

    ఒకప్పుడు అయోధ్యలో శ్రీరాముడు డేరాలో ఉండేవారని, ఇప్పుడు రాముడికి శాశ్వత ఇల్లును నిర్మించినట్లు మోదీ పేర్కొన్నారు.

    అలాగే దేశంలోని నాలుగు కోట్ల మంది పేదలకు కూడా శాశ్వత ఇల్లు లభించినట్లు వివరించారు.

    రాబోయే కాలంలో అయోధ్య అనేది.. అవధ్ ప్రాంతమే కాకుండా మొత్తం యూపీ అభివృద్ధికి దిశానిర్దేశం చేయబోతోందని ప్రధాని ఆకాంక్షించారు.

    భారతదేశం మరో పెద్ద ముందడుగు వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వందే భారత్, నమో భారత్ తర్వాత దేశానికి మరో ఆధునిక రైలు వచ్చిందన్నారు.

    కొత్త రైలుకు అమృత్ భారత్ అని పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ త్రిమూర్తులుగా చెప్పుకునే ఈ రైళ్లు భారతీయ రైల్వేకు పునర్వైభవం తీసుకురాబోతున్నాయని మోదీ అన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మాట్లాడుతున్న మోదీ

    #WATCH | Ayodhya, Uttar Pradesh: PM Narendra Modi says, "I have a request to all. Everyone has a wish to come to Ayodhya to be a part of the event on 22 January. But you know it is not possible for everyone to come. Therefore, I request all Ram devotees that once the formal… pic.twitter.com/pbL81WrsbZ

    — ANI (@ANI) December 30, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    అయోధ్య
    శ్రీరాముడు
    తాజా వార్తలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    నరేంద్ర మోదీ

    PM Modi: సైనికులు ఉన్నచోటే నాకు అయోధ్య: దీపావళి వేడుకల్లో ప్రధాని మోదీ  దీపావళి
    Modi Congratulates Team India: ప్రపంచ కప్ లో ఫైనల్ కి చేరిన టీమిండియాకు ప్రధాని అభినందనలు టీమిండియా
    Narendra modi: గ్లోబల్ సౌత్ ఏకం కావాల్సిన సమయం.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో పౌరుల మరణాన్ని ఖండించిన ప్రధాని మోదీ   భారతదేశం
    Modi on deepfake: అతిపెద్ద సవాల్గా డీప్‌ఫేక్‌ వీడియోలు.. గర్బా వీడియోపై ప్రధాని మోదీ భారతదేశం

    అయోధ్య

    'త్వరలోనే లక్నో పేరు 'లక్ష్మణ్ నగరి'గా మార్పు', యూపీ డిప్యూటీ సీఎం ప్రకటన లక్నో
    'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్ ఫరూక్ అబ్దుల్లా
    శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణ పనులు.. ఫోటోలు విడుదల శ్రీరాముడు
    అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు తేదీ ఖరారు; ప్రధాని మోదీకి ఆహ్వానం  శ్రీరాముడు

    శ్రీరాముడు

    కెనడాలో రామమందిరంపై దుండగుల దాడి; గోడలపై మోదీకి వ్యతిరేకంగా నినాదాలు కెనడా
    Ayodhya: అయోధ్యలో రామమందిరం కోసం 400కిలోల తాళం తయారు చేసిన వృద్ధ దంపతులు  అయోధ్య
    ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న మొదటి రాజు రాముడు: జీ20 బుక్‌లెట్స్‌లో కేంద్రం  జీ20 సదస్సు
    అయోధ్యలోని శ్రీరాముడి ఆలయం వద్ద రూ. 100 కోట్లతో 'లోటస్ ఫౌంటెన్' ఏర్పాటు  అయోధ్య

    తాజా వార్తలు

    NewsClick case: అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించిన HR హెడ్  న్యూస్ క్లిక్
    Kalvakuntla kavitha: కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి: ఎమ్మెల్సీ కవిత ధ్వజం  కల్వకుంట్ల కవిత
    Rajahmundry: రైలులో బిర్యానీ తిని 9 మందికి తీవ్ర అస్వస్థత  వైజాగ్
    Andhra pradesh tahsildar: లంచం ఎందుకు తీసుకోవాలో చెప్పిన తహసీల్దారు.. వీడియో వైరల్  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025